రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న తను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను నివాసంలో కలిశారు. కారు దిగి లోపలికి వెళ్లిన రజినీకాంత్కు స్వాగతం పలకడానికి సీఎం యోగి ఎదురుగా వచ్చారు. దీంతో రజినీ ఆయన కాళ్లకు దణ్ణం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సూపర్ స్టార్ రజినీకాంత్ లేటెస్ట్గా రిలీజ్ అయిన మూవీ‘జైలర్’ భారీగా వసూళ్లను రాబట్టింది. ఇప్పటి వరకు దాదాపుగా రూ. 500 కోట్లకుపైగా రావచ్చని అంచనా. ఈ చిత్రం నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో తెరకెక్కింది. ఈ సినిమాకు ముందే సూపర్ స్టార్ హిమాలయాలకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. శనివారం లక్నోలోని సీఎం యోగి నివాసంలో రజినీ కలిసి.. ఊహకందని విధంగా ఆయన కాళ్లకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..
రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న తను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ను నివాసంలో కలిశారు. కారు దిగి లోపలికి వెళ్లిన రజినీకాంత్కు స్వాగతం పలకడానికి సీఎం యోగి ఎదురుగా వచ్చారు. దీంతో రజినీ ఆయన కాళ్లకు దణ్ణం పెట్టారు. యోగి వారించినా కూడా వినకుండా సీఎం కాళ్లకు నమస్కారం పెట్టాడు రజినీ. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన రజినీ ఫ్యాన్స్ రజినీ చేసింది తప్పుబడుతున్నారు. మరికొందరు సూపర్ స్టార్ చేసిన పనిని సమర్థిస్తున్నారు.
ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. అభిమానులే కాకుండా కొందరు ప్రముఖ రాజకీయ నేతలు కూడా రజినీ చర్యను తప్పుబడుతున్నారు. తాజాగా రజినీకాంత్ తన పర్యటనను ముగించుకుని సోమవారం రాత్రి చెన్నై ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఈ క్రమంలో మీడియా కంట పడ్డారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి పాదాలను తాకడంపై వచ్చిన వివాదంపై సూపర్ స్టార్ స్పందన ఏంటని సూటిగా అడిగారు. యోగులు, సన్యాసులు పాదాలను తాకి వారి ఆశీర్వాదం తీసుకోవడం నాకు అలవాటు అని.. వారు నాకంటే చిన్నవారైనా సరే.. అది నా పద్ధతి అని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు రజినీకాంత్. దీంతో నెటిజన్ల నోర్లు మూతపడ్డాయి. తలైవా చెప్పిన మాటకు తప్పేమి లేదని.. విమర్శలకు తావులేదని తెలపడమైనది.