పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన ప్రేమకథా చిత్రం రాధే శ్యామ్. రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా పీరియాడిక్ మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. యూవీ క్రియేషన్స్, గోపికృష్ణ మూవీస్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. ఏప్రిల్ 1 అమెజాన్ ప్రైమ్ లో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు ఓటీటీ సంస్థ ట్వీట్ వేసింది
మార్చి 11న విడుదలైన ఈ చిత్రం కి బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ చిత్రంపై డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త పెదవి విరిచినా కూడా ఓ సెక్షన్ ఆడియెన్స్ మాత్రం మెచ్చుకున్నారు. మ్యూజిక్, విజువల్స్ ఇలా కొన్ని కోణాల్లో రాధే శ్యామ్ చిత్రం అదిరిపోయింది. RRR విడుదలైతే రాధేశ్యామ్ థియేటర్స్ లో నుంచి బయటకి వస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ విధంగానే ఈ సినిమాను త్వరగానే ఓటీటీలోకి విడుదల చేయబోతోన్నారు. ఏప్రిల్ ఒకటిన ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో రాబోతోంది. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఓటీటీలో రాధేశ్యామ్ సినిమాను ఎక్స్పీరియన్స్ చేసేందుకు రెడీగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి రాధేశ్యామ్ ఓటిటి రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Hop on this magical journey of love with #RadheShyamOnPrime, April 1
#Prabhas @hegdepooja @director_radhaa @UVKrishnamRaju #Vamshi #Pramod @PraseedhaU @UV_Creations @GopiKrishnaMvs @TSeries pic.twitter.com/D7ZcDFfS7y
— amazon prime video IN (@PrimeVideoIN) March 28, 2022