సీనియర్ హీరోయిన్, సహజనటి జయసుధ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను ఎలా చూస్తారు.. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు ఎలాంటి మర్యాదలు చేస్తారో చెప్పుకొచ్చారు. అంతేకాక.. తనకు పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా జయసుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్లో కొన్నింటిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అవార్డుల అంశంలో జయసుధ చేసిన వ్యాఖ్యలపై సినిమా ప్రొడ్యూసర్ ప్రసన్న కుమార్ రెడ్డి స్పందించారు. అవార్డుల విషయంలో జరిగే రాజకీయాలను ప్రస్తావిస్తూ.. ఓ సారి బాలయ్య సినిమాలో జరిగిన అన్యాయం గురించి చెప్పుకొచ్చి.. అప్పుడు ఎందుకు మాట్లాడలేదని జయసుధని ప్రశ్నించారు. ఆ వివరాలు..
ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ‘‘అవార్డుల విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవే. మీకు అన్యాయం జరిగినట్లు అనిపిస్తే.. అడిగే హక్కు ఉంది. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉండి.. మీరు పని చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో బాలకృష్ణ సినిమాకు అన్యాయం జరుగుతుంటే ఎందుకు స్పందించలేదు. ఆ సమయంలో ఆయన నటించిన శ్రీరామరాజ్యం సినిమాలో బాలకృష్ణ నటనకు నంది అవార్డు వస్తుందని భావించారు. అలానే నంది అవార్డుల కమిటీలోని మొత్తం సభ్యులు కూడా ఏకాభిప్రాయంతో బాలకృష్ణకు నంది అవార్డు ఇవ్వాలని సూచించారు. కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు.. రామారాజ్యం అంటే రాముడు, బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లు వస్తారు.. కాబట్టి ఆ సినిమాకు అవార్డు ఇవ్వకూడదని ఆయన పేరు కొట్టేసి వేరే హీరోకు అవార్డు ఇచ్చారు’’ అని చెప్పుకొచ్చాడు.
‘‘కేంద్ర ప్రభుత్వం కూడా ఆ సయమంలో నేషనల్ అవార్డులప్పుడు రామరాజ్యం సినిమాకు ఏ కేటగిరీలోనూ అవార్డులు లేకుండా చేసింది. ఈ సినిమా అనే కాదు అసలు రాముడు, కృష్ణుడు మీద వచ్చిన ఏ సినిమాకు అవార్డు ఇవ్వలేదు. ఎందుకంటే.. అది బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం. కేంద్రంలో అంటే సరే.. కానీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇలా జరిగినప్పుడు మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి మీరేందుకు అప్పుడు మాట్లాడలేదు. మీకు నొప్పి కలిగినప్పుడు మాత్రమే మాట్లాడతారా.. ఇతరుల విషయంలో అన్యాయం జరిగితే మాట్లాడరా.. అలా ఎలా కుదురుతుంది.. మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే.. అందరి బాధ్యత తీసుకోవాలి కదా’’ అంటూ కామెంట్స్ చేశారు. మరి ప్రసన్న కుమార్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.