ఉత్తమ చిత్రాలు, ఉత్తమ నటీ నటులకు అందించే నంది అవార్డులపై నటుడు పోసాని కీలక ప్రకటన చేశారు. ఎంతో ప్రత్యేకత ఉన్న నంది అవార్డులను బాధ్యతను సిఎం జగన్ తనకు అప్పగించారని పోసాని తెలిపారు.
తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన నటనతో ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించిన నటుడు మురళీ మోహన్. నటుడిగానే కాకుండా నిర్మాతగా ఎన్నో అద్భుతమైన చిత్రాలు అందించారు. రాజకీయాల్లో కూడా తన సత్తా చాటారు.
టాలీవుడ్లో ఇప్పుడు నంది అవార్డుల అంశం వివాదాస్పదంగా మారింది. కొన్నేళ్లుగా ఈ పురస్కారాలు ఇవ్వకపోవడంతో పలువురు సినీ ప్రముఖులు ఈ అంశంపై ఇటీవల పెదవి విప్పారు. అవార్డుల మీద అనేక అపోహలు ఉన్నాయని చెప్పారు. తాజాగా ఈ వివాదంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు.
తెలుగు సినిమాలకు నంది అవార్డుల రూపంలో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. అప్పట్లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఆ అవార్డులు వచ్చినప్పుడు నటీనటులు కూడా గౌరవంగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. దీనిపై ప్రముఖ నిర్మాతు స్పందించారు.
తెలంగాణ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో.."TFCC నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023" వేడుకలను దుబాయ్ లో ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ సందర్భంగా విజయేంద్ర ప్రసాద్ నంది అవార్ట్స్ పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ సినిమాలకు కచ్చితంగా నంది అవార్డులు ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా అన్నారు.
పోసాని కృష్ణ మురళి నంది అవార్ట్స్ పై ఘాటైన కామెంట్స్ చేశాడు. అవి నంది అవార్డ్స్ కావు కమ్మ అవార్ట్స్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా స్పందించారు సీనియర్ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్. నంది అవార్డ్స్ ఇప్పించే శక్తి ఉంటే ఇప్పించాలని సవాల్ విసిరారు.
సీనియర్ హీరోయిన్, సహజనటి జయసుధ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సినీ, రాజకీయ వర్గాల్లో పెను దుమారాన్ని రేపుతున్నాయి. ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను ఎలా చూస్తారు.. ముంబై నుంచి వచ్చిన వాళ్లకు ఎలాంటి మర్యాదలు చేస్తారో చెప్పుకొచ్చారు. అంతేకాక.. తనకు పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా జయసుధ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె చేసిన కామెంట్స్లో కొన్నింటిపై ప్రస్తుతం నెట్టింట జోరుగా చర్చ సాగుతోంది. ఈ క్రమంలో అవార్డుల అంశంలో జయసుధ చేసిన వ్యాఖ్యలపై […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలోని ప్రముఖులు ఒక్కొక్కరుగా మరణిస్తున్నారు. ఇటీవల కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టార్ మరణాన్ని జీర్ణించుకోక ముందే మరో విషాదం నెలకొంది. ప్రముఖ పాటల రచయితగా పేరు గాంచిన సిరివెన్నెల సీతారామాశాస్త్రి కన్నుమూశారు. ఇటీవల న్యూమోనియాతో బాధపడుతున్న ఆయన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించడంతో వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. అయినా కూడా ఆయన మెరుగుపడకపోవడంతో ఆరోగ్యం విషమించి మంగళవారం కన్నుమూశారు. ఇక సిరివెన్నెల […]