దక్షిణాది స్టార్ హీరోయిన్ ప్రియమణి పాపులర్ డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’లో భావోద్వేగానికి గురైంది. ఆమె వెండితెరపై హీరోయిన్ గా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుందో.. అదేవిధంగా బుల్లితెరపై ఢీ షో జడ్జిగా కూడా అంతే ఆకట్టుకుంటోంది. అయితే.. ఢీ షోలో జడ్జిగా ప్రియమణి అడుగుపెట్టి 5 ఏళ్ళు పూర్తవడంతో.. ఆమె లైఫ్ స్టోరీని ఓ పెర్ఫార్మన్స్ రూపంలో ప్రెజెంట్ చేశారు సాయి – నైనిక. ప్రియమణి సినిమాల్లోకి రాకముందు పడిన కష్టాలు మొదలుకొని.. ఆమె సినీఎంట్రీ, స్టార్ హీరోయిన్ గా ఎదిగిన విధానం, లవ్ – మ్యారేజ్.. ఇలా అన్ని విషయాలను టచ్ చేస్తూ స్టేజిపై ఎమోషనల్ పెర్ఫార్మన్స్ ప్రెజెంట్ చేశారు. అయితే.., ఈ మొత్తం పెర్ఫార్మెన్స్ లో ప్రియమణి ప్రేమ వివాహం జరిగిన తీరు హైలెట్ గా నిలిచింది. ఈ క్రమంలో జడ్జి సీట్లో కూర్చున్న ప్రియమణి తన భర్తను గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యింది.
హీరోయిన్ అయ్యాక తమిళ ‘పరుత్తివీరన్’ సినిమాకి నేషనల్ అవార్డు అందుకుంది ప్రియమణి. ఇక హీరోయిన్ గా 6 భాషల్లో 60 సినిమాలకు పైగా చేసి.. 5 భాషల్లో 22కు పైగా డాన్స్ షోలకు జడ్జిగా వ్యవరించిన విషయాలను కూడా అందంగా చెప్పుకొచ్చారు. అయితే.. ఆమె స్టార్ హీరోయిన్ గా ఉన్న సమయంలోనే ‘సెలబ్రిటీ క్రికెట్ లీగ్’ ఆర్గనైజర్ ముస్తఫాతో పరిచయం ఏర్పడి ప్రేమలో పడింది. తీరా పెళ్లి చేసుకుందామనే టైంకి వీరి పెళ్ళికి కులమతాలు అడ్డంకిగా నిలిచాయి. ఇద్దరి మతాలు వేరు కావడంతో కొందరు వీరి పెళ్లిపై అభ్యంతరాలు తెలుపుతూ.. ఎన్నో మాటలు అన్నారు. అన్ని అడ్డంకులను దాటుకొని ప్రియమణి, ముస్తఫా ఒక్కటయ్యారు. తాజాగా పెర్ఫార్మన్స్ లో పెళ్లి సమయంలో పడిన మాటలను గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమైంది.
మొత్తానికి ప్రియమణి లైఫ్ లో ఫేస్ చేసిన కష్టాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఆనందంగా ఉందని ఎమోషనల్ గా చూపించారు. అలాగే 17 ఏళ్ళ వయసులో ప్రియమణి తన తండ్రిని, అమ్మమ్మను ఒప్పించి సినిమాల్లోకి వచ్చిన ఎమోషనల్ మూమెంట్స్ ని, ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి సక్సెస్ అయిన తీరును చాలా హృద్యంగా చూపారు. ఢీ జడ్జిగా 5 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కంటెస్టెంట్స్ ఇచ్చిన ఈ పెర్ఫార్మన్స్ గిఫ్టు చూసి కంటతడి పెట్టుకుంది. ప్రస్తుతం ప్రియమణి ఎమోషనల్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరి నటి ప్రియామణి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.