ఈ మద్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా ఉన్నవాళ్లు హఠాత్తుగా కుప్పకూలిపోతున్నారు.. ఆస్పత్రికి తరలించేలోపు చనిపోతున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుసగా గుండెపోటు మరణాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అప్పటి వరకు మనతో ఎంతో సంతోషంగా గడిపిన వారు అకస్మాత్తుగా కుప్పకూలిపోతున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన గానంతో కోట్లమందిని కదిలించిన ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో అకాల మరణం చెందారు. నిత్యం తన పాటలతో ప్రజలను ఉత్తేజపరుస్తూ.. అలరిస్తూ ఉండే సాయిచంద్ హఠాత్తుగా చనిపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. సాయి చంద్ ని భార్య రజిని కన్నీరు పెట్టడం చూస్తుంటే ప్రతి ఒక్కరి హృదయాలు చలించిపోతున్నాయి. తాజాగా ఆమె సాయిచంద్ ని తల్చుకొని ఏడుస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
తెలంగాణ జానపద గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గురువారం గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం ఆయన తన కుటుంబ సభ్యులతో నాగర్ కర్నూల్ లోని తన పామ్ హౌస్ కి వెళ్లారు. అర్థరాత్రి హఠాత్తుగా గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు నాగర్ కర్నూల్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కేర్ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. ఆయన మరణవార్త విన్న తెలంగాణ ప్రజలు, రాజకీయ నేతలు, అభిమానులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సాయిచందర్ భౌతిక కాయాన్ని చూసేందుకు బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు తరలి వచ్చారు. సీఎం కేసీఆర్.. సాయిచంద్ భౌతిక కాయాన్ని చూసి కంటతడి పెట్టారు.
సాయి చంద్ మరణం ఇప్పటికీ ఆయన కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన సతీమణి రజినీ.. సాయిచంద్ ని తల్చుకొని కన్నీరుమున్నీరు అవుతుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి చంద్ గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు.. ‘సాయి చంద్ అంటేనే సాయం.. సాయి చంద్ జీవితంలో ప్రతిదశలోనూ కష్టాలు ఎదుర్కొన్నారు.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఆయన అహర్శిశలూ కష్టపడ్డారు.. రాత్రిపగలు అనే తేడా లేకుండా ఉద్యమం కోసం తన పాటలతో ప్రజల్లో తెలంగాణ స్ఫూర్తిని నింపారు. ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడుతున్నాం.. అంతలోనే దేవుడు తీసుకు వెళ్లిపోయాడు. ఆయన పాట వింటే ప్రతిఒక్కరూ స్పందించేవారు.. సమాజంలో కుల వివక్షత, జాతి వివక్షత, ప్రాంతీయ వివక్షత పై ఆయన భావజాలంలో నుంచి ఎన్నో పాటలు పుట్టుకొచ్చాయి. ఎవరినీ కించపరిచే మనస్తత్వం సాయి చంద్ కి లేదు. అందరూ నావాళ్లు అనుకుంటారు.. ఇంత చిన్న వయసులోనే చనిపోతారని ఎవరూ ఊహించలేదు’అంటూ సాయిచంద్ను తల్చుకొని కన్నీరుమున్నీరైన రజిని.