సోషల్ మీడియాలో హీరోయిన్స్ పై ట్రోలింగ్స్ అనేవి మామూలే. సినిమాలలో సాంప్రదాయాలకు సంబంధం లేని గ్లామర్ పాత్రలలో కనిపిస్తారు. కాబట్టి.. రియల్ లైఫ్ లో కూడా అలాగే సాంప్రదాయాలకు, ఇండియన్ కల్చర్ కి దూరంగా ఉంటారని భావిస్తుంటారు నెటిజన్స్. అయితే.. సినిమాలలో నటించేటప్పుడు పాత్ర డిమాండ్ బట్టి గ్లామరస్ రోల్స్ చేస్తాంగానీ, నేను కూడా ఇండియన్ సాంప్రదాయాలు చిన్నప్పటి నుండి చూస్తూ పెరిగానని చెబుతోంది హీరోయిన్ ప్రణీత సుభాష్.
లాక్ డౌన్ లో బిజినెస్ మ్యాన్ నితిన్ రాజ్ ని ప్రేమించి పెళ్లాడిన ప్రణీత.. ఇటీవల పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అటు భర్త, ఇటు కూతురుతో ఫ్యామిలీ లైఫ్ ని ఆస్వాదిస్తుంది. అలాగే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ ఏవైనా అప్ డేట్స్, లేదా తన కూతురితో కలిసున్న ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం భర్త నితిన్ రాజ్ కి పాదపూజ చేసిన ఫోటోలు షేర్ చేసింది ప్రణీత. భీమన అమావాస్య పూజ సందర్భంగా అలా చేసింది.
పెళ్లి కాని అమ్మాయిలు కూడా మంచి భర్త రావాలని ఈ పూజ చేస్తుంటారు. అయితే.. సాంప్రదాయాలను ఫాలో అవుతూ భర్త పాదాలకు పూజ చేసిన ప్రణీతను కొందరు నెటిజన్లు ఇంకా ఏ కాలంలో ఉందో అంటూ వెటకారంగా ట్రోల్ చేశారు. ఈ విమర్శలపై తాజాగా ప్రణీత స్పందించినట్లు తెలుస్తుంది. జీవితంలో జరిగే అన్ని విషయాలకు రెండు కోణాలుంటాయి. 90 శాతం జనాలు పాజిటివ్ గా స్పందిస్తారు. మిగిలినవారు నోటికొచ్చినట్లు వాడుతుంటారు. నా భర్త నా ఇష్టం.. అవన్నీ నేను పట్టించుకోనని అంటోంది ప్రణీత.
ఇంకా ఒక నటిగా నేను గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నంతమాత్రాన సాంప్రదాయాలను, ఆచారాలను పాటించనని అనుకుంటుంన్నారేమో. చిన్నతనం నుండి నేను కూడా అన్ని చూస్తూ పెరిగాను. నా ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఇరుగుపొరుగు వారు ఇలా అందరూ ఈ పూజ చేస్తుంటారు. అంతెందుకు పెళ్ళైన కొత్తలో కూడా చేశా. కానీ, ఆ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. నేను పద్దతులను పాటించాలని అనుకుంటాను. సాంప్రదాయాలు, పూజలను గౌరవిస్తాను. మోడరన్ గా ఆలోచించినంత మాత్రాన సాంప్రదాయాలను మర్చిపోలేం కదా” అంటూ ట్రోల్స్ పై చురకలు వేసింది. మరి ప్రణీత సమాధానం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.