విజయ్ దేవరకొండతో వివాదంపై అనసూయ తొలిసారిగా స్పందించారు. తనను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడానికి కారణం ఎవరో ఆమె వెల్లడించారు. ఆ వ్యక్తే ట్రోలర్స్ కి డబ్బులు ఇచ్చి మరీ తిట్టిస్తున్నాడని ఆమె అన్నారు.
అర్జున్ రెడ్డి సినిమా విడుదలైనప్పటి నుంచి అనసూయ విజయ్ దేవరకొండను టార్గెట్ చేస్తూ వచ్చారు. ఈ సినిమా ప్రమోషన్ లో విజయ్ దేవరకొండ వాడిన భాషను ఆమె తప్పుబట్టారు. దీంతో ఆమె విజయ్ దేవరకొండ అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు. విజయ్ ఫ్యాన్స్ ఆమెను ట్రోల్ చేస్తూ వచ్చారు. దీంతో అనసూయ, విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మధ్య కొన్నాళ్ళుగా ట్విట్టర్ వేదికగా వార్ నడుస్తోంది. ఎట్టకేలకు దీనికి ముగింపు పలుకుతున్నట్లు అనసూయ వెల్లడించారు. విమానం మూవీ ప్రమోషన్ లో భాగంగా ఆమె ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండలో తలెత్తిన విభేదాలపై స్పందించారు. తనకు మానసిక ప్రశాంతత కావాలని, అందుకే ఈ గొడవను ఇక్కడితో వదిలేద్దామనుకుంటున్నానని ఆమె ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
విజయ్ దేవరకొండ అభిమానులతో కోల్డ్ వార్ మొదలైనప్పటి నుంచి తాను మానసిక ప్రశాంతతను కోల్పోయానని ఆమె అన్నారు. ఇంత జరుగుతుందని విజయ్ కి తెలుసో లేదో నాకు తెలీదు, కానీ విజయ్ దేవరకొండకి క్లోజ్ గా ఉండే ఒక వ్యక్తి సోషల్ మీడియాలో తనపై ట్రోల్స్ చేయిస్తున్నాడని తెలిసిందని ఆమె అన్నారు. అతనే డబ్బులు ఇచ్చి మరీ తనపై వ్యతిరేకతను ప్రచారం చేస్తున్నాడని తెలిసిందని ఆమె అన్నారు. ఈ విషయంలో తాను అలసిపోయానని.. ఇక్కడితో ఈ వివాదానికి ముగింపు పలకాలని భావిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. విజయ్ గురించి గానీ, విజయ్ కి సంబంధించిన వాటి గురించి గానీ మాట్లాడనని ఆమె అన్నారు. విజయ్ దేవరకొండ తనకు ఎంతో కాలం నుంచి తెలుసునని, తమ మధ్య ఎలాంటి సమస్య లేదని, ఇద్దరం మంచి స్నేహితులమని అన్నారు.
అయితే అర్జున్ రెడ్డి సినిమా ప్రమోషన్ లో విజయ్ తీరు తనను బాధించిందని, అభిమానులతో అభ్యంతరకర పదాలను పలికించారని.. ఒక తల్లిగా అది నన్నెంతో బాధ పెట్టిందని అన్నారు. ఇలాంటివి ప్రోత్సహించవద్దని విజయ్ కి చెప్పానని, కానీ ఆ తర్వాత తనపై ట్రోల్స్ మొదలయ్యాయని అన్నారు. ఆ బాధ నుంచి బయటకు వచ్చి విజయ్ దేవరకొండ నిర్మించిన ‘మీకు మాత్రమే చెప్తా’ సినిమాలో నటించానని, విజయ్ కి సంబంధించిన వ్యక్తి తనపై ట్రోల్స్ చేయడం కోసం పలువురికి డబ్బులు ఇస్తున్నాడని తెలిసి షాకయ్యానని ఆమె వెల్లడించారు. విజయ్ కి తెలియకుండా ఇది జరుగుతుందా? అని అనిపించిందని.. అయితే విజయ్ తనను ద్వేషిస్తున్నాడో లేదో తెలియదు కానీ ఇక్కడితో ఈ గొడవను ఆపేసి ప్రశాంతంగా ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు. మానసిక ప్రశాంతతను కోరుకుంటున్నట్లు అనసూయ చెప్పుకొచ్చారు. మరి ఇప్పటికైనా అనసూయని టార్గెట్ చేయడం మానేస్తారో లేదో చూడాలి. మరి అనసూయ కామెంట్స్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.