గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఎక్కువగా చెక్కర్లు కొడుతున్న వార్త ఏదైనా ఉంది అంటే అది ప్రభాస్ అరోగ్యం గురించే. ఫిబ్రవరిలో డార్లింగ్ జ్వరం బారిన పడినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే చికిత్స కోసం ప్రభాస్ విదేశాలకు వెళ్లాడు అన్న వార్త హాట్ టాపిక్ గా మారింది.
సినిమా పరిశ్రమలో తీరికలేకుండా షూటింగ్స్ లో పాల్గొనడం వల్ల కొంత మంది హీరోలు అనారోగ్యం బారినపడుతుంటారు. ఇక గత కొంతకాలంగా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్న వార్త ప్రభాస్ ఆరోగ్యానికి ఏమైందని? ఈ మధ్య కాలంలో వరుస షూటింగ్స్ మూలంగా ప్రభాస్ తరచుగా అనారోగ్యం పాలవుతున్నాడు. ఆదిపురుష్ టీజర్ లాంచ్ సమయంలో ప్రభాస్ మోకాళ్లకు ఆపరేషన్ చేయించుకున్నట్లు వార్తలు వచ్చాయి. అప్పటి నుంచే ప్రభాస్ తరచుగా జ్వరంతో బాధపడుతున్నాడు. రీసెంట్ గా ఫిబ్రవరిలో కూడా డార్లింగ్ జ్వరం బారిన పడ్డాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో మారుతి సినిమా షూటింగ్ కూడా వాయిదా పడిందని సమాచారం. ఈ నేపథ్యంలోనే మరోసారి ప్రభాస్ ఆరోగ్యం గురించి ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లాడని సమాచారం. ప్రభాస్ ఆరోగ్యానికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా దూసుకెళ్తున్నాడు. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతితో రాజా డీలక్స్ సినిమాలు చేస్తున్నాడు డార్లింగ్. అయితే ఆదిపురుష్ టీజర్ లాంచింగ్ టైమ్ లో ప్రభాస్ మోకా్ళ్లకు ఆపరేషన్ చేయించుకున్నట్లు సమాచారం. ఇక అప్పటి నుంచే ప్రభాస్ కు తరచుగా జ్వరం రావడం మెుదలైందంట. దాంతో డాక్టర్స్ కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారట. అయితే ప్రభాస్ మాత్రం అన్ని షూటింగ్స్ కంప్లీచ్ చేసి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడట. కానీ డార్లింగ్ అనారోగ్యం కారణంగా తీవ్రంగా ఇబ్బందులు పడుతుండటం వల్ల కచ్చితంగా ట్రీట్ మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడని, అందుకోసమే ప్రభాస్ విదేశాలకు వెళ్లాడని సమాచారం. అయితే ప్రభాస్ టీమ్ మాత్రం అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ప్రభాస్ క్యాజువల్ హెల్త్ చెకప్ కోసమే వెళ్లాడు అని చెబుతున్నారు. ఇక ప్రభాస్ హెల్త్ ఇష్యూ కారణంగా సలార్ తో పాటుగా, ప్రాజెక్ట్ కె సినిమా షూటింగ్ లు వాయిదా పడే అవకాశం ఉంది. ఇక ప్రభాస్ కు ఏమైందో తెలియాలి అంటే డార్లింగ్ ఫారిన్ నుంచి తిరిగా వచ్చేదాక ఆగాల్సిందే.