Saaho: ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమా అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా అనే స్టేటస్ ని రాజమౌళి క్రియేట్ చేసిన తర్వాత.. ప్రతి ఇండస్ట్రీలో పాన్ ఇండియా ట్యాగ్ తో సినిమాలు తెరమీదకు వస్తున్నాయి. అయితే.. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీయాలంటే ఖచ్చితంగా.. స్టార్ కాస్ట్, వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్ వర్క్.. ఇవన్నీ కలిపి సినిమాలో ప్రేక్షకులను మెప్పించగలిగే అద్భుతమైన యాక్షన్, ఒళ్ళు గగ్గుర్పొడిచే సీన్స్ అన్నింటినీ లెక్కలోకి తీసుకోకతప్పదు.
అదీగాక ఇప్పుడు ప్రేక్షకుల మైండ్ సెట్ కూడా ఎక్కువగా యాక్షన్ సినిమాలనే కోరుకుంటోంది. అందుకు తగ్గట్టుగా మేకర్స్ కూడా స్టార్ హీరోలతో యాక్షన్ స్టోరీ ప్లాన్ చేసి.. అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్.. ఛేజింగ్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్యాంగ్స్ అంటూ ఊహించని స్థాయిలో గ్రాఫిక్స్ తో విజువల్స్ సృష్టిస్తున్నారు. ఈ విషయంలో తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘సాహో’ మూవీ తెరమీదకు వచ్చింది. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సాహో సినిమా.. 2019లో విడుదలై అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రభాస్ లెక్కలేనన్ని యాక్షన్ ఫీట్స్, రిస్కీ షాట్స్ చేశాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ మేకింగ్ వీడియో చూస్తే.. షాక్ కి గురవుతారు. దాదాపు 350 కోట్ల బడ్జెట్ తెరకెక్కిన ఈ సినిమాలో విజువల్స్ అన్ని ఐఫీస్ట్ గా అనిపిస్తాయి. అందుకు ప్రధాన కారణం గ్రాఫికల్ వర్క్. తాజాగా మేకింగ్ వీడియో చూసినట్లయితే బిల్డింగ్ కూలిపోయే సీన్, ఆ తర్వాత ప్రభాస్ ని హైవేపై భారీ ట్రక్కుతో ఛేజ్ చేసే సీన్.. పైన హెలికాఫ్టర్ నుండి ఎటాక్ చేసే సీన్స్ అన్ని గ్రాఫిక్స్ లో సృష్టించినవే.
ఇక సాహోలో హైవేపై ప్రభాస్ ని ఛేజ్ చేసే సీన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే.. ఈ విజువల్ వండర్ సీన్ ని గ్రీన్ మ్యాట్ లో షూట్ చేశారు. పైనుండి హెలికాఫ్టర్ ఎటాక్ జరిగే సీన్ లో.. ప్రభాస్ వెనక్కి తిరిగి చూస్తాడు. ఆ టైంలో వెనుక గాల్లో హెలికాఫ్టర్ లేకపోవడాన్ని మీరు మేకింగ్ వీడియోలో చూడవచ్చు. ఆ తర్వాత సినిమాలోకి వచ్చేసరికి సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించే రేంజిలో గ్రాఫిక్స్ తో మ్యాజిక్ చేశారు మేకర్స్.
ఇదిలా ఉండగా.. సాహో సినిమా ఫలితం గురించి పక్కన పెడితే.. ప్రభాస్ ని పాన్ ఇండియా యాక్షన్ హీరోగా పరిచయం చేసింది. ముఖ్యంగా బాలీవుడ్ మార్కెట్ లో ప్రభాస్ కి క్రేజ్ రావడంలో సాహో ఎంతో తోడ్పడింది. ఇక ఈ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధాకపూర్ తెలుగులో డెబ్యూ చేసింది. యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన ఈ సినిమా దాదాపు 450 కోట్లకు పైగా వసూల్ చేసింది. ప్రస్తుతం డార్లింగ్ ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. మరి సాహో మేకింగ్ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.