ఈ మధ్యకాలంలో దక్షిణాది సినీ ఇండస్ట్రీ పాన్ ఇండియా స్థాయి సినిమాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టింది. సౌత్ లోని స్టార్ హీరోలు అందరూ పాన్ ఇండియా క్రేజ్ వైపే ఫోకస్ పెడుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ దక్కించుకున్న సౌత్ స్టార్స్ లో ఆల్రెడీ డార్లింగ్ ప్రభాస్, అల్లు అర్జున్ చేరగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కన్నడ హీరో యశ్ బ్లాక్ బస్టర్ విజయాలతో జాబితాలో చేరారు.
ప్రభాస్ ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా అంచనా వేయలేని విధంగా వందల కోట్ల బడ్జెట్ సినిమాల్లో నటిస్తున్నాడు. కేవలం ప్రభాస్ స్టార్డమ్ పైనే నిర్మాతలు ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె లాంటి పాన్ ఇండియా సినిమాలను లైనప్ చేసుకున్నారు. అయితే.. బాహుబలి-2 తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధే శ్యామ్ సినిమాలు నిరాశపరిచాయి. ముఖ్యంగా సాహూ కలెక్షన్స్ రాబట్టినప్పటికీ, రాధే శ్యామ్ మూవీ డిసాస్టర్ గా నిలిచింది.
ఇది చదవండి: సుధీర్ కోసం పాట పాడిన యాంకర్ రష్మీ.. వీడియో వైరల్!
అంత మాత్రాన ప్రభాస్ రేంజిని తక్కువ చేయలేం. ఒక్క హిట్ పడిందంటే నేషనల్ వైడ్ బాక్సాఫీస్ షేక్ అవుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి.
సౌత్ నుండి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, యశ్ లాంటి హీరోల వల్ల పాన్ ఇండియా లెవల్లో మీకు పోటీ పెరిగిందని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు.. ప్రభాస్ స్పందించి.. “పాన్ ఇండియా మూవీస్ హిట్ అవ్వడం వల్ల నాకు పోటీ పెరిగిందని భావించడం లేదు. పోటీ ఎక్కడైనా ఉంటుంది. కాకపోతే దాన్ని మనం పోటీ అని భావించినప్పుడే. ప్రస్తుతం సినిమాలకు మార్కెట్ బాగా పెరిగింది. అందరం కలిసి ఇకనుండి ఇండియన్ సినిమాలు చేయబోతున్నాం.
ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూశాను. నాకు ఎంతో నచ్చింది. రాజమౌళి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీ డైరెక్టర్ కాదు.. ఇండియన్ డైరెక్టర్. ‘కేజీఎఫ్ 2’ బ్లాక్ బస్టర్ కావడం అనందంగా ఉంది. అలాంటి గొప్ప సినిమా చేసిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ చేయడం సంతోషంగా ఉంది” అని ప్రభాస్ చెప్పినట్లు సినీ వర్గాల సమాచారం.