సినీ, సాహిత్యం, విద్య, కల్చర్ ఇతర రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వాళ్లకు యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు అందిస్తున్న విషయం తెలిసిందే. గోల్డెన్ వీసా ద్వారా ఆ దేశంలో ఎలాంటి పరిమితులు లేకుండా నివసించవొచ్చు. 2019 నుంచి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసాలు మంజూరు చేస్తూ వస్తుంది. యూఏఈ ప్రభుత్వం ఇచ్చే గోల్డెన్ వీసాకు పది నుంచి పదిహేను సంవత్సరాల కాలపరిమిది ఉంటుంది. ఇప్పటి వరకు బాలీవుడ్ ఇప్పటి వరకు పలువురు హీరోలు గోల్డెన్ వీసా అందుకున్నారు. ఇటీవల కమల్ హాసన్ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా అందజేసింది.
సినీ ఇండస్ట్రీలో వైవిద్య పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు హీరో విక్రమ్. తమిళనాట అభిమానులు ముద్దుగా చియాన్ అంటారు. తాజాగా హీరో విక్రమ్ కి యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా ఇచ్చి గౌరవించింది. ఇప్పటి వరకు భారతీయ సినీ నటులకు గోల్డెన్ వీసా లభించింది.. వారి లీస్ట్ లో విక్రమ్ కొత్తగా చేరాడు. నటి పూర్ణ ఆమె భర్త తో కలిసి గోల్డెన్ వీసా విక్రమ్ కి అందించారు. అయితే ఈ గోల్డెన్ విక్రమ్ కి పూర్ణా దంపతులు ఇవ్వడంపై రక రకాల ప్రశ్నలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. దీని వెనుక అసలు కథ ఏంటంటే..
నటి పూర్ణా అలియాస్ షామ్నా ఖాసీం భర్త షానిద్ ఆసీఫ్ అలీ. యూఏఈలో బిగ్గెస్ట్ వ్యాపారస్తుల్లో ఒకరు. ప్రస్తుతం అక్కడ ఆయన పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అయితే షానీద్ తన కంపెనీ ద్వారా హీరో విక్రమ్ కి గోల్డెన్ వీసా వచ్చే విధంగా చొరవ తీసుకోవడం వల్ల నే ఇది సులభం అయ్యిందని ఫిలిమ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం పా రంజీత్ దర్శకత్వంలో ఓ పిరియాడికల్ చిత్రంలో నటిస్తున్నాడు హీరో విక్రమ్. మణి రత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రంతో మంచి విజయం అందుకున్నాడు.