సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ వరస రీమేక్స్ చేస్తున్నారు. ఇప్పుడు దీని గురించి మాట్లాడిన నిర్మాత నాగవంశీ.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఈ పేరు చెప్పగానే ఫ్యాన్స్ కు గూస్ బంప్స్ గ్యారంటీ. ఆయన సినిమాలు చూసినా, పాటలు విన్నాసరే అభిమానులు ఓ రకమైన ఎనర్జీ ఫీలవుతారు. టాలీవుడ్ లో పవన్ క్రేజ్ అందుకునే పర్సన్ ఇప్పట్లో అయితే రాకపోవచ్చు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్న పవన్.. ఓవైపు హీరోగా చేస్తూనే మరోవైపు పాలిటిక్స్ లోనూ బిజీగా ఉన్నారు. అంతా బాగానే ఉంది కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో పవన్ వరసపెట్టి రీమేక్ మూవీస్ చేస్తున్నారు. ఇదే డైహార్డ్ ఫ్యాన్స్ అయోమయంలో పడేస్తోంది. అసలేం జరుగుతుందో తెలీక వాళ్లు జుత్తుపీక్కుంటున్నారు. ఇప్పుడు వాటిపై ప్రముఖ నిర్మాత నాగవంశీ ఓ క్లారిటీ ఇచ్చేశారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. ‘అజ్ఞాతవాసి’ వరకు హీరోగా వరస సినిమాలు చేసిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత పాలిటికల్ గా బిజీ అయ్యేందుకు నటనకు బ్రేక్ ఇచ్చారు. చాలామంది అది కంప్లీట్ బ్రేక్ అనుకున్నారు. అయితే మూడేళ్ల తర్వాత ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు. ఆ సినిమా హిందీ సూపర్ హిట్ ‘పింక్’ రీమేక్. గతేడాది ‘భీమ్లా నాయక్’తో ప్రేక్షకుల్ని పలకరించారు. ఇది మలయాళ హిట్ ‘అయ్యప్పనుమ్ కోశియమ్’కు రీమేక్. దీని తర్వాత ‘హరిహర వీరమల్లు’ ఒరిజినల్ స్టోరీతో తీస్తున్న మూవీ. నెక్స్ట్ లైన్ లో ఉన్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (‘తెరి’ రీమేక్), OG (ఓ తమిళ సినిమాకు రీమేక్) సినిమాలు కూడా రీమేక్ అనే టాక్ వస్తోంది.
పవన్ కల్యాణ్ ఫ్రెండ్ అనగానే డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుర్తొస్తారు. త్రివిక్రమ్ తో కలిసి నిర్మాత నాగవంశీ సినిమాలు తీస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నాగవంశీ ఓ ఇంటర్వ్యూలో పాల్గొనగా.. పవన్ వరసగా రీమేక్స్ ఎందుకు చేస్తున్నారు? దీని వెనక త్రివిక్రమ్ హస్తం ఏమైనా ఉందా? అని యాంకర్ అడిగారు. దీనికి సమాధానమిచ్చిన నాగవంశీ.. రీమేక్స్ విషయంలో ఫైనల్ డెసిషన్ పూర్తిగా పవన్ కల్యాణ్ దే అని క్లారిటీ ఇచ్చేశారు. ఆయనే నిర్ణయం తీసుకుంటారని, త్రివిక్రమ్ ఇన్వాల్వ్ మెంట్ ఏ మాత్రం ఉండదని చెప్పుకొచ్చారు. దీంతో ఫ్యాన్స్ కు ఓ విషయమైతే క్లియర్ అయిపోయినట్లు కనిపిస్తుంది. మరి పవన్ వరస రీమేక్స్ చేయడంపై మీరేమనుకుంటున్నారు. కింద కామెంట్ చేయండి.