సాధారణంగా స్టార్ హీరోలకు సంబంధించి సినిమా షూటింగ్స్ ఒకే ఏరియాలో జరుగుతున్నాయంటే.. ఆయా హీరోలు ఒకరినొకరు సెట్స్ లోకి వెళ్లి కలవడం చూస్తుంటాం. తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో అలాంటి విశేషమే జరిగింది. వీరసింహారెడ్డి షూటింగ్ సెట్ లో నందమూరి బాలకృష్ణని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసిన పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీరసింహా రెడ్డి మూవీకి సంబంధించి లాస్ట్ సాంగ్ షూట్ తో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ మూవీ షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లోనే జరుగుతోంది. ఈ క్రమంలో ఇద్దరి షూటింగ్ పక్కపక్కనే కాబట్టి.. వీరసింహారెడ్డి సెట్ కి వెళ్లిన పవన్ కళ్యాణ్.. బాలకృష్ణని కలిసారని సమాచారం.
ఇక బాలకృష్ణ హీరోగా నటిస్తున్న మాస్ యాక్షన్ మూవీ ‘వీర సింహారెడ్డి’ 2023 సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది. క్రాక్ ఫేమ్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ తో హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమాకి సంబంధించి ఓ సాంగ్ షూట్ మిగిలి ఉండటంతో ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోలో షూట్ చేస్తున్నారు. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. దీనికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు. మరోవైపు రాజకీయాలతో పాటు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. హరిహర వీరమల్లు మూవీని త్వరగా పూర్తిచేసే పనిలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో మొదటిసారి పీరియడ్ యాక్షన్ జానర్ లో ఈ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ పూర్తిచేసుకున్న వీరమల్లు మూవీని 2023 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారట. అయితే.. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. జాగర్లమూడి క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని.. ఏఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ చేసిన వీరమల్లు గ్లింప్స్ చూసి ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోయాయి. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వీరసింహారెడ్డిని వీరమల్లు వెళ్లి కలవడం చర్చనీయాంశంగా మారింది. మరి బాలయ్యని పవన్ కలవడంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలపండి.
#Pawankalyan with #NandamuriBalakrishna in #VeeraSimhaReddy shoot .
Follow us 👉 @tollymasti pic.twitter.com/kBy02CHPXG— Tollymasti (@tollymasti) December 23, 2022