హర్యానా గవర్నర్ బండారు దంత్తాత్రేయ గత ఆదివారం నిర్వహించిన ‘అలయ్ బలయ్’ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్కళ్యాణ్, ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణు మాట్లాడుకోలేదని, ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే వార్తలకు చెక్ పెట్టారు మంచు విష్ణు. ఆ రోజు వేదికపై ఇద్దరు ఎడమొఖం, పెడమొఖం ఉన్న దృశ్యాలు మీడియాలో ప్రసారం అయ్యాయి. మా ఎన్నికల నేపథ్యంలోనే ఇద్దరు ఇలా ఉన్నారని అంతా భావించారు.
ఇదే విషయాన్ని మంచు విష్ణు సోమవారం ప్రెస్మీట్లో ప్రస్తామించారు. పవన్తో నేను మాట్టాడినట్టు వేదిక కింద తామిద్దరం పలు విషయాలపై మాట్లాడుకున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ వీడియోలో పవన్, విష్ణు అప్యాయంంగా ఆలింగనం చేసుకుని, చాలా సేపు మాట్లాడుకున్నారు. దీంతో ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు అనే విషయం స్పష్టమైంది.
What really went down 😎. https://t.co/6uHvs1He2S
— Vishnu Manchu (@iVishnuManchu) October 19, 2021