నందమూరి కుటుంబలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాల్గవ కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఆకస్మిక మరణం చెందారు. దీంతో.. నందమూరి కుటుంబంలో విషాదం నెలకొంది. ఊహించని పరిణామంతో.. నందమూరి కుటుంబంతో పాటుగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. భువనేశ్వరి – బ్రాహ్మణి సైతం ఉమామహేశ్వరి ఇంటి వద్దకు చేరుకున్నారు. లోకేష్ కూడా విషయం తెలిసిన వెంటనే తన పిన్ని ఇంటికి పరుగున చేరుకున్నారు.
ఇక ఉమా మహేశ్వరి ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు తెలుస్తోంది. మరి ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందనే కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇటీవలే ఉమామహేశ్వరి చిన్న కుమార్తెకు వివాహం జరిగింది. ఆ సమయంలోనే చంద్రబాబు – దగ్గుబాటి ఫ్యామిలీలను కలుసుకున్నారు. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న నందమూరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
కొంతకాలంగా ఉమామహేశ్వరి ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స తీసుకుంటున్నారు. అయితే.. ఆరోగ్య సమస్యలతో పాటు మానసిక ఒత్తిడి కారణంగా ఆమె ఆత్మహత్య చేసుకొని ఉంటుందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక పిన్ని మరణంతో హుటాహుటిన ఆమె ఇంటికి చేరుకున్న నారా లోకేష్.. అక్కడ జరగాల్సిన పనులను తన భుజాలపై వేసుకున్నట్లు తెలుస్తుంది. లోకేష్ ప్రస్తుతం ఉమా మహేశ్వరీ ఇంటివద్ద నుండి బంధువులకు సమాచారం అందించారు.