రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్లే కార్లు ఒకవైపు.. తమ అభిమానించే వారి సతీమణులు మరోవైపు. అభిమానుల మనస్సు పులరించేలా చేసిన హుస్సేన్ సాగర్ తీరం.. ఎందుకు..? ఏమిటి..? అన్నది కింద చదవండి.
ఎవరికి వారు బిజీ లైఫ్ ని లీడ్ చేస్తున్న రోజులివి. ఎదుటివారితో పలకరింపులు, వారి క్షేమ సమాచారాలను అడిగే తీరిక అస్సలు ఉండట్లేదు. అందులోనూ రాజకీయ, సినీ సెలబ్రిటీ కుటుంబాలకు చెందిన వారంటే మరీ బిజీ. ఇలాంటి రోజుల్లో ఎవ్వరూ ఊహించని ఘటన ఒకటి చోటుచేసుకుంది. నారావారి కోడలు బ్రాహ్మణి, నందమూరి కోడలు లక్ష్మీ ప్రణతి ఒకేచోట కనిపించారు. వీరిద్దరూ దగ్గరి బంధులువైనా కలిసి కనిపించిన సందర్భాలు చాలా తక్కువ. అలాంటిది ఇద్దరూ ఒకేచోట కనువిందు చేయడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
హైదరాబాద్ నడిబొడ్డున హుస్సేన్ సాగర్ తీరాన ఫార్ములా ఈ- కార్ రేసింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. రయ్ మంటూ కార్లు దూసుకెళ్లడం ఒక ఎత్తైతే.. నువ్వా నేనా అంటూ రేసర్లు పోటీ పడుతుంటారు. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లు రుయ్.. రుయ్.. మంటూ దూసుకెళ్తూ క్షణాల్లో కళ్ళముందే మాయమవుతుంటాయి. ఈ రేసును ప్రత్యక్షంగా వీక్షించడానికి నారా బ్రాహ్మణి- లక్ష్మీ ప్రణతి విచ్చేశారు. బ్రాహ్మణి కొడుకు దేవాన్ష్ తో కలిసి హాజరుకాగా, లక్ష్మీ ప్రణతి ఒంటరిగానే విచ్చేసింది. దీంతో ఇద్దరూ ఒకేచోట కనిపించారు. ఉత్కంఠను పంచె రేసు ఒకవైపు, సెలెబ్రిటీలు కళ్ళముందు కనిపించడంతో అభిమానులు ఆనందంతో కేరింతలు కొట్టారు.
అయితే ఈ రేసింగ్ చూడటానికి మరికొంత మంది సెలబ్రిటీలు విచ్చేశారు. మహేశ్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు రేసింగ్ చూస్తూ సందడి చేశారు. ప్రధాన రేస్ శనివారం జరగనుండగా, శుక్రవారం ప్రీ ప్రాక్టీస్ -1 రేస్ను నిర్వహించారు. మొత్తం 11 జట్ల నుంచి 22 మంది డ్రైవర్లు ఈ ప్రీ రేస్ లో పాల్గొన్నారు. ట్రాక్ ఎలా స్పందిస్తోంది.. కార్లను ఎలా అదుపు చేసుకోవాలి.. ఎక్కడ వేగం పెంచాలి.. వంటి విషయాలపై రేసర్లకు అవగాహన రావడనికే ఈ ప్రీ రేసును నిర్వహిస్తారు.
— SumanTV (@SumanTvOfficial) February 10, 2023