కలెక్షన్ కింగ్ మోహన్ బాబు… హీరో విశాల్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారాయి. మంచు ఫ్యామిలి అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్గా ఉంటుంది. ఇక మంచు లక్ష్మి, విష్ణు చేసే వ్యాఖ్యలపై బయట ఎంత ట్రోలింగ్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని రోజుల క్రితం ట్రోలర్స్ మీద పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. అయినా సరే.. వారు చేసే వ్యాఖ్యలు ఏదో రకంగా విమర్శిస్తూనే ఉంటారు నెటిజనులు. తాజాగా విశాల్పై.. మోహన్ బాబు చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్గా మారాయి. సినిమా పేరే కాదు.. విశాల్కు నిజంగానే పొగరు అంటూ మోహన్ బాబు వ్యాఖ్యానించడం గమనార్హం. ఇంతకు ఏ సందర్భంలో మోహన్ బాబు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.. దానికి విశాల్ రియాక్షన్ ఏంటి వంటి వివరాలు..
విశాల్ హీరోగా.. ఎ. వినోద్ కుమార్ తెరకెక్కించిన లాఠీ చిత్రం.. ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో.. సోమవారం.. తిరుపతిలోని ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజ్, ఎస్డీహెచ్ఆర్ కాలేజీల్లో.. రెండు వేర్వేరు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇక ఎస్డీహెచ్ఆర్ కాలేజీలో నిర్వహించిన వేడుకకు మోహన్బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘గత ఎనిమిదేళ్లుగా మా కుటుంబానికి సంబంధించిన సినిమాలకు తప్ప.. బయటి వాటికి వెళ్లడం లేదు. కానీ విశాల్ చనువు తీసుకుని.. అంకుల్ తిరుపతిలో లాఠీ ప్రీరీలిజ్ ఈవెంట్ ఉంది.. మీరు రావాలి అని కోరాడు. వెంటనే ఓకే అన్నాను. విశాల్ కుటుంబంతో నాకున్న అనుబంధం అలాంటిది. విశాల్ తండ్రి నన్ను హీరోగా పెట్టి.. యం. ధర్మరాజు: ఎంఏ అనే సినిమా తీశాడు. అప్పటి నుంచి నాకు వారితో పరిచయం’’ అని చెప్పుకొచ్చారు.
‘‘విశాల్ హీరోగా నటించిన పందెం కోడి సినిమా నాకు చాలా ఇష్టం. దానిలో తన నటన నాకు బాగా నచ్చింది. తను చాలా మంచి కథలను సెలక్ట్ చేసుకుంటాడు. ప్రేమ చదరంగం, పొగరు లాంటి సినిమాలు ఆ కోవలోకే వస్తాయి. వాస్తవంగా కూడా విశాల్కు కాస్త పొగరు ఉందని నాకు తెలుసు. మనిషికి పొగరుండాలి.. కానీ అది ఇతరులకు హానీ చేసేలా ఉండకూడదు. లాఠీ కానిస్టేబుల్ కథ. సమాజంలో ఏం జరిగినా.. ముందు తెలిసేది కానిస్టేబుల్కే. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే నాకు ఎంతో గౌరవం ఉంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. పందెంకోడిలా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు మోహన్ బాబు. విశాల్ను ఉద్దేశించి మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.