Dhanush: 1990-2010 మధ్య కాలంలో తమిళంలో టాప్ కమెడియన్గా వెలుగొందారు వడివేలు. హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్ తీసుకున్నారు. కానీ, 2010 తర్వాత సినిమాల్లో అవకాశాలు చాలా తగ్గిపోయాయి. ఇందుకు ఆయన ప్రవర్తనే కారణమని తమిళ సినీ వర్గాల వాదన. హీరోలతో కూడా ఆయన గొడవలు పెట్టుకునే వారనే ప్రచారం ఉంది. సురాజ్ దర్శకత్వంలో ధనుష్ నటించిన ‘పడికాదవన్’ సినిమా సమయంలో వడివేలుకు, ధనుష్కు మధ్య గొడవైందని.. ఆ గొడవ కారణంగానే వడివేలు ఆ సినిమానుంచి తప్పుకున్నారని సమాచారం.
తాజాగా, ధనుష్-వడివేలు గొడవపై నటుడు మీసై రాజేంద్రన్ స్పందించారు. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ… ‘‘ పడికాదవన్ సినిమా షూటింగ్ హైదరాబాద్లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. మొదట్లో ఆ సినిమాలో వడివేలు నటించారు. హీరో ధనుష్తో పాటు అందరూ 7 గంటలకు షూటింగ్ స్పాటుకు వస్తే.. వడివేలు మాత్రం 9గంటలకు వచ్చేవారు. అందులో నాది ఆయన్ని కొట్టే క్యారెక్టర్. నన్ను చూడగానే.. ‘‘నన్ను కొట్టడానికి ఈయన వద్దు. వేరే వ్యక్తిని తీసుకురండి’’ అన్నాడు.
పెద్ద డిస్కషన్ తర్వాత నన్నే ఫైనల్ చేశారు. మధ్యాహ్నం 1 గంటకు షూటింగ్ ఉంటే.. 3 గంటలకు వడివేలు వచ్చాడు. అప్పుడు ధనుష్కు వడివేలుకు మధ్య సీన్ జరుగుతోంది. ఎన్ని టేక్లు తీసుకున్నా వడివేలు సరిగా చేయటంలేదు. కొద్దిసేపటి తర్వాత ధనుష్ ‘‘అన్నా డైరెక్టర్ చెప్పింది చేయండన్నా’’ అని అన్నాడు. దీంతో వడివేలుకు కోపం వచ్చింది. సాయంత్రం షూటింగ్ ప్యాకప్ అయిపోగానే రూమ్లో ఓ పెద్ద గొడవ చేశారు. ‘నేను చంద్రముఖి సినిమాలో వాడి మామ రజినీకాంత్కే ఎలా నటించాలో చెప్పాను’ అని సీరియస్ అయ్యారు.
మరుసటి రోజు సుమన్తో సీన్లు ఉన్నాయి. వడివేలు సుమన్ కాళ్లు నొక్కాలి. వడివేలు ఇందుకు ఒప్పుకోలేదు. పెద్ద గొడవ జరిగింది. అయినా ఆయన ఒప్పుకోలేదు. తర్వాత కడుపు నొప్పి అని చెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. ఆ వెంటనే హైదరాబాద్నుంచి చెన్నై వచ్చేశారు. ఆ తర్వాతే ఈ సినిమాలోకి వివేక్ వచ్చారు. డైరెక్టర్ చెప్పింది చేశారు’’ అని అన్నారు. మరి, వడివేలు- ధనుష్ గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : హీరోయిన్కు మించిన అందాలతో సారా టెండూల్కర్!