ఇటీవల సోషల్ మీడియా, మీడియా ఎక్కడ చూసినా కూడా మంచు వారి ఇంట్లో వివాదం అంటూ వార్తలు, వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. అన్నదమ్ముల మధ్య విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయంటూ కామెంట్స్ వినిపించాయి. అయితే ఇప్పుడు మంచు విష్ణు- మనోజ్ గొడవ విషయంలో పెద్ద ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది.
మంచు వారి కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని, అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయంటూ ప్రచారం జరిగింది. విష్ణు- మనోజ్ గొడవ పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగానే.. మోహన్ బాబు కూడా ఈ వివాదంపై స్పందించారు. క్షణికావేశంలో జరిగేవి ఇవి అంటూ కామెంట్ చేశారు. అయితే ఇప్పుడు ఈ వివాదంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. అది అసలు నిజమైన గొడవ కానేకాదట. అదంతా ప్రాంక్ వీడియో అంటూ స్వయంగా మంచు విష్ణునే ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు రియాలిటీ షో సహా ఆస్తుల పంపకం, ఇలా అన్ని అంశాల మీద వివరణ ఇచ్చాడు.
విష్ణు మాట్లాడుతూ.. ” హౌస్ ఆఫ్ మంచుస్ రియాలిటీ షో త్వరలో ఉండబోతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ తో చర్చలు జరుగుతున్నాయి. మనోజ్ తో గొడవ విషయం మీద తొందరలోనే మీకు క్లారిటీ ఇస్తాను” అన్నారు. అవును.. విష్ణు- మనోజ్ గొడవ నిజం కాదట. అదొక రియాలిటీ షో కోసం చేసిన వీడియో అని అధికారికంగా ప్రకటించారు. మంచు ఫ్యామిలీ త్వరలోనే ఒక రియాలిటీ షోని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుందట. దానికి ‘హౌస్ ఆఫ్ మంచూస్’ అని పేరు కూడా పెట్టారు. ఈ షోకి సంబంధించిన ఒక టీజర్ ని మంచు విష్ణు తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇది కేవలం ఆరంభం మాత్రమే అంటూ కొటేషన్ కూడా పెట్టారు.
త్వరలోనే ఒక ప్రముఖ ఓటీటీ వేదికగా ఈ రియాలిటీ షో స్ట్రీమ్ కానున్నట్లు వెల్లడించారు. ఈ వీడియో చూసిన తర్వాత నెటిజన్స్ ఒకింత షాకయ్యారు. ఎందుకంటే అందరూ అది నిజమైన గొడవే అనుకున్నారు. కానీ, ఇలా ప్రాంక్ అనేసరికి ఆశ్చర్యానికి గురయ్యారు. గట్టిగానే ప్లాన్ చేశారు అయితే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక మంచు విష్ణు సినిమాల విషయానికి వస్తే.. తదుపరి ప్రాజెక్టుగా కన్నప్ప సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నామని అన్నారు. చాలా రిస్క్ చేసి ఈ సిసిమాని నిర్మిస్తున్నానని.. ఈ సెప్టెంబర్ నుంచి కన్నప్ప షూటింగ్ ప్రారంభం కానుందని విష్ణు చెప్పుకొచ్చాడు.