మంచు లక్ష్మీ.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కుమార్తె అని పిలిచే స్థాయి నుంచి ఆమెకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించారు. టాలీవుడ్ లో మంచు లక్ష్మి నటిగా, నిర్మాతగా తానేంటో నిరూపించుకున్నారు. అయితే నెట్ ఫ్లిక్స్ లో వచ్చిన పిట్ట కధలు వెబ్ సిరీస్ తర్వాత మళ్లీ ఆవిడ స్క్రీన్ మీద కనిపించలేదు. తన తర్వాతి ప్రాజెక్ట్స్ గురించి కూడా ఎలాంటి అప్డేట్ లేదు. తాజాగా మంచు లక్ష్మి లీడ్ రోల్ ‘లేచింది మహిళా లోకం’ అనే సినిమాలో నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాలోనే ప్రముఖ నటి సురేఖా వాణి కుమార్తె కూడా వెండితెరకు పరిచయం కాబోతోంది. మంచు లక్ష్మి అటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గానే ఉంటుంది. ఇటీవల యూట్యూబ్ ఛానల్ లో వ్లాగ్స్ చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది. తాజాగా ఆమె చేసిన ఓ ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది.
ఇదీ చదవండి: సర్కారు వారి పాట మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ కావాలంటే..!
మంచు లక్ష్మీ ఆరోగ్యం విషయంలో ఎంత కేర్ ఫుల్ గా ఉంటారనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా మంచు లక్ష్మీ యోగాసనాలు వేస్తున్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ఫొటోలను ఆమె స్వయంగా తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేశారు. నిజానికి ఇప్పుడేదో యోగా చేయడం కాదు.. ఆవిడ గతంలోనూ యోగా ప్రాముఖ్యత, యోగా చేయడం వల్ల కలిగే లాభాల గురించి వీడియో కూడా రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మంచు లక్ష్మీ షేర్ చేసిన యోగాసనాలు వైరల్ గా మారాయి. మంచు లక్ష్మీ షేర్ చేసిన యోగాసనాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.