సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు, వారి ఫ్యామిలీ మెంబర్స్ కి సంబంధించి ఎలాంటి వార్త బయటికి వచ్చినా ఫ్యాన్స్ వెంటనే రియాక్ట్ అవుతుంటారు. ముఖ్యంగా సెలబ్రిటీల ఆరోగ్యం విషయంలో ఏ బ్యాడ్ న్యూస్ వినిపించినా కంగారు పడిపోతుంటారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి గారు ఇందిరా దేవి ఆరోగ్య పరిస్థితి గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె హెల్త్ కండిషన్ సీరియస్ అవ్వడంతో ఆమెను ఏఐజి హాస్పిటల్ లో చేర్పించినట్లు తెలుస్తుంది.
ఇందిరా దేవి ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారని సమాచారం. మహేష్ బాబు కూడా అక్కడే హాస్పిటల్ లో తల్లి వద్దే ఉన్నాడట. అయితే.. ఇందిరా దేవి ఆరోగ్యం పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చారట. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, వెంటిలేటర్ పై ఆమెకు చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారట. దీంతో కంగారు పడిపోయిన మహేష్ ఫ్యాన్స్.. ఇందిరా దేవి ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిసే సరికి ఊపిరి పీల్చుకున్నారు.
ఇక ఇందిరా దేవి త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మహేష్ బాబుకు ఇందిరమ్మ అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎలాంటి అకేషన్ ఉన్నా, తన తల్లి గురించి ప్రస్తావించకుండా ఉండలేడు. అలాగే తన పేరెంట్స్ గురించి ప్రస్తావన వస్తే మహేష్ ఎమోషనల్ అయిపోతాడు. అంత ప్రేమ మహేష్ కి తన పేరెంట్స్ అంటే. ఇక మహేష్ బాబు పిల్లలు సితార, గౌతమ్ కూడా తన నాన్నమ్మతో అప్పుడప్పుడు సరదాగా టైం స్పెండ్ చేయడం చూస్తుంటాం.
ఇందిరా దేవి, సూపర్ స్టార్ కృష్ణ గారిని 1961లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రమేష్ బాబు, మంజుల, మహేష్ జన్మించారు. ఆ తర్వాత 1969లో కృష్ణ, విజయ నిర్మలను రెండో పెళ్లి చేసుకున్నారు. విజయ నిర్మల 2019లో చనిపోయారు. లాక్ డౌన్ టైంలో మహేష్ బాబు అన్న రమేష్ బాబు కన్నుమూశారు. ఇలా ఘట్టమనేని ఫ్యామిలీ ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతుండగా.. ఇందిరా దేవి ఆరోగ్యం సీరియస్ అవ్వడం అనేది ఫ్యాన్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది. ఇందిరా దేవి హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయినట్లు కూడా వార్తలొస్తున్నాయి. మరి ఆమె ఆరోగ్యం గురించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Mahesh Babu’s Mother Indira Devi garu is doing fine. She admitted and discharged from Hospital. Don’t believe any other rumours.
— Censor Reports 💎 (@CensorReports) September 23, 2022