టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. సినిమా సినిమాకి తన క్యారెక్టర్లో వేరియేషన్స్ చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయన తాజా చిత్రం ‘‘సర్కారు వారి పాట’’లోనూ కొత్త లుక్ అండ్ మ్యానరిజంతో కనిపిస్తున్నారు. దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్ బేస్ ఉన్న మహేష్.. ఎప్పుడెప్పుడు బాలీవుడ్ ఎంట్రీపై చాలా ఏళ్ల నుంచి చాలా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ ఎంట్రీపై మహేష్ క్లారిటీ ఇచ్చారు.
ఇదీ చదవండి: బాలీవుడ్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన మహేష్ బాబు
మహేష్ మాట్లాడుతూ.. ‘‘నాకు చాలా బాలీవుడ్ ఆఫర్లు వచ్చాయి. వాళ్లతో నాకు సరిపోదు అనుకున్నాను. నా టైం వేస్ట్ చేసుకోవాలనుకోలేదు. అందుకే హిందీ సినిమాల వైపు వెళ్లలేదు. నాకు తెలుగులో ఇంత ఆదరణ, ప్రేమ లభిస్తున్నపుడు వేరే ఇండస్ట్రీలోకి నేను ఎందుకు వెళ్తాను. నేను ఎప్పటికీ ఇక్కడే సినిమాలు చేస్తాను. అవి పెద్ద ఎత్తున రిలీజ్ అవుతాయి. ఇప్పటిలాగే ఇకపై ఎప్పుడు ఇండియా మొత్తం తెలుగు సినిమాలను ఆస్వాదించాలి. తెలుగు సినిమాలే నా బలం.. నేను అర్థం చేసుకోగల ఎమోషన్ కేవలం తెలుగు సినిమా ఎమోషన్ మాత్రమే’’ అని చెప్పుకొచ్చారు.
అయితే.. బాలీవుడ్ తనను భరించలేదని, అక్కడికెళ్లి తన టైం వేస్ట్ చేసుకోవాలని అనుకోవట్లేదని.. మహేష్ చేసిన వ్యాఖ్యలను బాలీవుడ్ వర్గాలు తప్పు పడుతున్నాయని సమాచారం. కాగా, ఈ వ్యవహారంపై మహేష్ టీమ్ స్పందించింది. మహేష్ మాటలను తప్పుగా అర్థం చేసుకొని ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మహేష్ టీమ్ చెప్పుకొచ్చింది. ‘మహేష్ కి అన్ని భాషల సినిమాలపై అమితమైన గౌరవం ఉంది. ఆయనకు అన్ని భాషలు సమానమే. ఎన్నో ఏళ్లుగా తెలుగులోనే సినిమాలు చేయడం వలన.. వేరే ఇండస్ట్రీలకంటే తెలుగులో తనకు కంఫర్ట్ గా ఉంటుందని చెప్పారంతే. ఎలాగో త్వరలో రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోతుందని మహేష్ చెప్పాడు” అని టీమ్ క్లారిటీ ఇచ్చింది.
ఇక సర్కారు వారి పాట సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. మే 12న ఏ సినిమా ప్రపంచవ్యాప్తంగా రెలీస్డ్ కాబోతుంది. గీత గోవిందం ఫేమ్ పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. మరి, మహేష్ బాబు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.