ఎవరినైనా ప్రేమిస్తుంటే.. ఆ విషయాన్నిబాహాటంగానే బయటకు చెప్పేస్తున్నారు నటీ నటులు. మొన్న రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు ఇతడేనని చెప్పేయగా.. తాజా మరో హీరోయిన్ తన మనసులోకి వ్యక్తి గురించి బయటపెట్టింది.
ప్రస్తుతం సినీ పరిశ్రమలో ప్రేమ జంటలు ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. తమ ఇష్టమైన వారితో ఏడడుగులు వేస్తున్నారు. మరికొంత మంది తమ మనసులోని వ్యక్తులను బహిరంగంగానే బయటపెడుతున్నారు. వాలంటైన్స్ డే పురస్కరించుకుని పలువురు సినీ తారల తాము ప్రేమిస్తున్న వ్యక్తుల ఫోటోలను సోషల్ మీడియాలో బాహాటంగానే వెల్లడించారు. వారిలో ఒకరూ నటి కృతి కర్బంద. గతంలో ఓ హీరోతో రిలేషన్ షిప్ లో ఉన్నట్లు గుసగుసలు రాగా, వాటిని నిజం చేస్తూ ఆమె పెట్టిన పోస్టు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.
నటి కృతి కర్బంద. 2009లో బోణీ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత తీన్మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త సినిమాల్లో నటించారు. ఇవేవీ ఆమెకు విజయాన్నితీసుకురాలేదు. వీటితో పాటు పలు కన్నడ చిత్రాల్లో నటించారు. అయితే ఆమె తెలుగులో కన్నా కన్నడ నాట ఆదరణ లభించింది. శాండీల్ వుడ్ లో స్టార్ హీరోయిన్ హోదాను సంపాదించుకుంది. 2016లో తెలుగులో రామ్ చరణ్ నటించిన బ్రూస్ లీ సినిమాలో హీరోకి సోదరిగా నటిచింది ఢిల్లీ భామ. అయితే ఈ సినిమా కూడా పరాజయం పాలవ్వడంతో ఇక్కడ సినిమాలు చేయలేదు. కన్నడ సీమ నుండి తర్వాత హిందీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అక్కడ పలు హౌస్ ఫుల్ 4, పాగల్ పంటి, 14 ఫెహరే వంటి చిత్రాలతో అలరించింది.
ప్రస్తుతం బాలీవుడ్ నటుడు పులికిత్ సామ్రాట్ తో రిలేషన్ లో ఉంది. అయితే తాజాగా వాలంటైన్స్ డే నాడు తన ప్రేమను బయటకు చెప్పింది. వీరిద్దరూ దిగిన ఫోటోను షేర్ చేసిన కృతి హ్యాపీ వాలంటైన్స్ డే అంటూ రాసింది. గతంలో పులకిత్ కు వివాహం చేసుకోగా..పెళ్లైన ఏడాదికే విడిపోయారు. ఇటీవల కాలంలో సినీ పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. డిసెంబర్ లో హన్సిక మొత్వాని పెళ్లి పీటలు ఎక్కగా.. ఆ తర్వాత అతియా శెట్టి, కె ఎల్ రాహుల్ ఒక్కటయ్యారు. ఈ ఫిబ్రవరిలోనే కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. అయితే ఈ జంట కూడా త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై వీరిద్దరూ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.