భారతీయ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. కారు ప్రమాదంలో ఒక ప్రముఖ నటుడు మృతి చెందారు.
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈమధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న స్టార్ నటులు, మేకర్స్, టెక్నీషియన్స్ ఎప్పటికీ తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. ఇన్నాళ్లు తమకు ఎంతో వినోదాన్ని పంచిన తారల మరణవార్తలను విని ఆడియెన్స్ తట్టుకోలేకపోతున్నారు. తమను ఎంటర్టైన్ చేయడంతో పాటు స్ఫూర్తిగా నిలిచిన స్టార్స్ ఇక లేరనే వార్తతో అభిమానులు శోకసంద్రంలో మునిగిపోతున్నారు. తాజాగా అలాంటి మరో చేదు వార్త వినాల్సి వస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కొల్లాం సుధి ఇవాళ కన్నుమూశారు. నటుడిగా మంచి ఇమేజ్ తెచ్చుకున్న 39 ఏళ్ల సుధి.. రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కొల్లాం సుధి ప్రయాణిస్తున్న కారుకు సోమవారం ఉదయం యాక్సిడెంట్ అయింది.
తోటి ఆర్టిస్టులు ఉల్లాస్ అరూర్, బినూ అదిమాళి, మహేష్లతో కలసి కొల్లాం సుధి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలిసింది. ఈ యాక్సిడెంట్లో సుధి మరణించగా.. మిగతా ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. త్రిస్సూర్లోని కాయపమంగళంకు సమీపంలో ఉదయం 4.30కి ఈ ప్రమాదం జరిగింది. ఒక ఈవెంట్ అనంతరం వడాకరా నుంచి తిరిగి వస్తుండగా ఓ ట్రక్ను కొల్లాం సుధి ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో సుధికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయన్ను కొడుంగళ్లూరులోని ఆస్పత్రికి తరలించారు. కానీ చికిత్స పొందుతూనే సుధి ప్రాణాలు వదిలారని వైద్యులు తెలిపారు. మిగిలిన ముగ్గురికి ప్రస్తుతం చికిత్స అందిస్తున్నామని చెప్పారు. కాగా, సుధి పలు టెలివిజన్ సీరియళ్లతో పాటు కొన్ని చిత్రాల్లోనూ నటించారు. ‘కట్టప్పన’, ‘కుట్టందన్’, ‘తేట రాప్పై’, ‘వాకతిరివ్’, ‘యాన్ ఇంటర్నేషనల్ స్టోరీ’, ‘కేషు యే దిహిన్ నాథన్’, ‘ఎస్కేప్’ మూవీస్తో సుధి నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు.
Mimicry artist Kollam Sudhi dies in road accident
Read @ANI Story | https://t.co/5THnnvKWW9#KollamSudhi #roadaccident #Thrissur pic.twitter.com/6Xe5KMagzS
— ANI Digital (@ani_digital) June 5, 2023