గత నాలుగు నాలుగేళ్లుగా వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీసిన మలయాళ నటుడు రాజ్ మోహన్.. ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. అనంతరం అయన మృతదేహం సోమవారం వరకు మార్చురీలోనే ఉంది. పార్థివదేహాన్ని తీసుకెళ్లేందుకు ఎవరూ రాకపోవడంతో త్రివేండ్రంలోని ప్రభుత్వాసుపత్రి మార్చురీలో ఉంచారు.
రాజ్ మోహన్ గతకాలపు ప్రముఖ వ్యక్తి కళానిలయం కృష్ణన్ నాయర్ యొక్క అల్లుడు. 1967లో ‘ఇందులేఖ’ సినిమాలో హీరోగా నటించిన ఆయన.. భార్యతో విడాకుల తర్వాత ఇండస్ట్రీకి దూరమయ్యారు. చూసుకునేవారు లేకపోవడంతో చాలాకాలం ఒంటరిగా జీవించి, ఆ తర్వాత పులయనకోటలోని ఓ అనాథాశ్రమంలో చేరారు. అనారోగ్యంతో జూలై 4న ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు.
ఈ ఘటనపై స్పందించిన కేరళ ఫిలిం పోర్టియోస్ సహకార శాఖ రాష్ట్ర మంత్రి V.N.వాసవన్, నటుడికి అంత్యక్రియలు సవ్యంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇది కూడా చదవండి: Hyderabad: రూ.3 వేల కోసం ఇలా చేశావేంటి తల్లి? పిల్లలను కూడా కాదని!