తెలుగు బుల్లితెరపై సూపర్ క్రేజ్ దక్కించుకున్న జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. మోడలింగ్ నుండి సినిమాల్లో అడుగుపెట్టిన వర్ష.. ఆ తర్వాత సీరియల్స్ కూడా నటించింది. కానీ, సినిమాలు, సీరియల్స్ తీసుకురాలేని గుర్తింపును జబర్దస్త్ కామెడీ షో ద్వారా రాబట్టుకోగలిగింది. ముఖ్యంగా జబర్దస్త్ లో ఇమ్మానుయేల్ కి జంటగా నాన్ స్టాప్ పంచులతో కామెడీ పండించే వర్ష.. సోషల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. జబర్దస్త్ లోనే కాకుండా అప్పుడప్పుడు తన గ్లామర్ షోతో సోషల్ మీడియాలో కూడా హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంటుంది.
ఈ క్రమంలో జబర్దస్త్ స్టేజిపై తన బేర్ వాయిస్ తో ఎన్నో పంచులు భరించే వర్షను బుల్లితెర అభిమానులు ఎప్పుడూ ఇష్టపడుతూనే ఉంటారు. కమెడియన్ ఇమ్మానుయేల్ కి జంటగా ఎప్పుడైతే స్టేజిపై క్లిక్ అయ్యిందో.. అప్పటినుండి వర్షను, ఇమ్మానుయేల్ లను వేరు చేసి చూడలేకపోతున్నారు ఫ్యాన్స్. సుధీర్, రష్మీ జంటలాగా వర్ష, ఇమ్మానుయేల్ జంటను కూడా జనాలు ఓన్ చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో తాజాగా వర్ష తన ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన ఫోటోలు చూసి కంగారు పడిపోతున్నారు అభిమానులు. ఎందుకంటే.. ఆ ఫోటోలలో వర్ష హాస్పిటల్ బెడ్ పై సెలైన్ పెట్టుకొని కనిపించడం గమనార్హం.
ఈ నేపథ్యంలో జబర్దస్త్ వర్షకు ఆరోగ్యం బాలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఆదివారం చికెన్ తినలేకపోయానని, ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నానని చెప్పిన వర్ష.. హాస్పిటల్ బెడ్ పై చికిత్స పొందుతున్న ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అలాగే ఏవో టెస్టులు కూడా చేయించుకుంటున్నట్లు ఫోటోలు చూస్తే తెలుస్తోంది. ఈ పిక్స్ చూసిన నెటిజన్స్ జబర్దస్త్ వర్షకు ఏమైందోనని ఆందోళన చెందుతుండగా.. జబర్దస్త్ టీమ్ కూడా కంగారు పడుతున్నట్లు సమాచారం. ఇక హాస్పిటల్ బెడ్ పై వర్షను చూసిన ఫ్యాన్స్ త్వరగా కోలుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి వర్షకు అసలు ఏమైంది అనేది తెలియాల్సి ఉంది.
Jabardasth Varsha pic.twitter.com/eawuah3YXh
— Hardin (@hardintessa143) October 24, 2022