చిత్రపరిశ్రమలో హీరోల మధ్య ఎంత స్నేహం ఉంటుందో.. వారి ఫ్యామిలీస్ మధ్య కూడా అంతే సాన్నిహిత్యం కనిపిస్తుంటుంది. టాలీవుడ్ లో సినిమాల పరంగా పోటీ పడినప్పటికీ, పర్సనల్ లైఫ్ లో బెస్ట్ ఫ్రెండ్స్ గా ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే.. హీరోలు హీరోలకు మధ్య స్నేహం అనేది మామూలే. కానీ.. హీరోల పిల్లలతో వేరే హీరో స్నేహం చేయడం అనేది ఆసక్తిరేపే విషయం. అందులోను రైటర్ గా, యాక్టర్ గా సక్సెస్ అయిన హీరో.. అప్ కమింగ్ హీరోతో ఫ్రెండ్ షిప్ అంటే.. ఎన్నో ఊహాగానాలు వ్యక్తం అవుతుంటాయి. ప్రస్తుతం యంగ్ హీరో అడవి శేష్.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ ల స్నేహం గురించి అదే జరుగుతోంది.
అడవి శేష్ – అకీరా నందన్ మంచి ఫ్రెండ్స్ అని ఎంతో కాలంగా అందరికి తెలుసు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో అయినా, బయటైనా ఇద్దరు ఒకరి గురించి ఒకరు ప్రస్తావన తీసుకొస్తుంటారు. ముఖ్యంగా అడవి శేష్ కి అకీరా అంటే చాలా ఇష్టం. ఒక తమ్ముడిగా, బెస్ట్ ఫ్రెండ్ గా అకీరాని సంబోధిస్తుంటాడు. అలాగే అకీరా ఏం చేసినా శేష్ సపోర్ట్ చేస్తూ.. సోషల్ మీడియాలో విష్ చేయడం చూస్తూనే ఉన్నాం. అలా ఇద్దరి మధ్య అన్నదమ్ములను మించి గొప్ప సాన్నిహిత్యం ఉంది. సినీ నటుడిగా, రైటర్ గా అడవి శేష్ పవర్.. టాలెంట్ ఏంటో తెలిసిందే. తన కథలను, స్క్రిప్టులను తానే రాసుకుంటూ వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్నాడు.
ఈ క్రమంలో అడవి శేష్ కి, అకీరాలకు సంబంధించి ఏ చిన్న వార్త తెలిసినా శేష్ ఫ్యాన్స్ తో పాటు పవర్ స్టార్ ఫ్యాన్స్ కూడా ఎంతో ఎక్సయిట్ అవుతుంటారు. అదీగాక మల్టీటాలెంటెడ్ అయిన అకీరాను ఎప్పుడెప్పుడు తెరపై హీరోగా చూస్తామా అని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇలాంటి తరుణంలో శేష్ – అకీరా కాంబినేషన్ గురించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజమో కాదో తెలియదు గానీ ఖచ్చితంగా పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుందని అంటున్నారు. ప్రస్తుతం అడవి శేష్ హీరోగా ‘హిట్ 2’ మూవీ రిలీజ్ కి రెడీ అయ్యింది. హిట్ ఫేమ్ శైలేష్ కొలను హిట్ 2 తెరకెక్కించాడు.
తాజాగా హిట్ 2 మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా జరిగింది. ఇక మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన హిట్ 2 ట్రైలర్ ఇప్పుడు ట్రెండింగ్ లో దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ఈ ఈవెంట్ లో అడవి శేష్ సినిమా గురించి మాట్లాడి.. మధ్యలో పవన్ కళ్యాణ్, అకీరా నందన్ ఇద్దరూ తనకు గుండె లాంటివారని చెప్పుకొచ్చాడు. దీంతో శేష్ – అకీరా కాంబినేషన్ పై గూస్ బంప్స్ తెప్పించేలా ఓ వార్త బయటికి వచ్చింది. కొంతకాలంగా అకీరా నందన్ హీరోగా డెబ్యూ చేయబోతున్నాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ, ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. అకీరా డెబ్యూ మూవీకి అడవి శేష్ కథను అందించనున్నట్లు సినీవర్గాల సమాచారం.
అకీరా కోసం శేష్ చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో అదిరిపోయే స్టోరీ రెడీ చేయనున్నాడని టాక్ నడుస్తోంది. మరి అకీరాతో ఉన్న ఫ్రెండ్ షిప్, ఆ క్లోజ్ బాండింగ్ దృష్ట్యా శేష్.. స్టోరీ అందించేందుకు సిద్దమైనట్లు రూమర్స్. చూడాలి మరి త్వరలోనే ఈ కాంబినేషన్ పై క్లారిటీ రానుందేమో. అయితే.. ఈ వార్త తెలిసిన పవర్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ లో పూనకాలు మొదలైపోయాయి. ఎలాగో శేష్ బెస్ట్ థ్రిల్లింగ్ కథలను రాసుకుంటూ ఉంటాడు. అలాంటిది పవర్ స్టార్ తనయుడి డెబ్యూ మూవీ కోసం అంటే.. ఎలాంటి కథ సిద్ధం చేస్తాడోనని అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు.