Venu Thottempudi: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటులలో వేణు తొట్టెంపూడి ఒకరు. హీరోగా కెరీర్ ప్రారంభించిన వేణు… తనదైన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ వేణు సినిమాలను ఎక్కువగా ఇష్టపడేవారు. స్వయంవరం మూవీతో ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన వేణు.. హీరోగా వరుస విజయాలను అందుకుంటూ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు.
కొన్నేళ్లకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయి. అనంతరం చాలా కాలం పాటు సినిమాల్లో కనిపించలేదు. తాజాగా రవితేజ హీరోగా వస్తున్న “రామారావు ఆన్ డ్యూటీ” సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా ప్రమోషన్ లో వేణు ఫుల బిజీ బిజీగా పాల్గొన్నారు. ఈ క్రమంలో ఓ ఇంటర్వూలో పాల్గొన్న వేణు.. జగపతిబాబుతో తన విభేదాలపై స్పందించారు.
వేణు మాట్లాడుతూ.. ‘‘ చిన్న సంఘటన జరిగింది. దాన్ని ఎలాబరేట్ చేయటం కూడా నాకు ఇష్టం లేదు. దాని వల్ల ఫైనాన్షియల్గా లాస్ అయ్యాను. ఆ రోజుల్లో నాకు అది పెద్ద ఎమౌంట్. ఆయన మధ్యలో ఎంటర్ అయ్యారు. వేరే వ్యక్తికి పూచికత్తు ఉన్నారు. పర్సనల్ గ్యారంటీ అన్నారు. ఆయన చెప్పినట్లు నా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తి సరిగా తిరిగి ఇవ్వలేదు. ఆ తర్వాత నాకెప్పుడూ జగపతి బాబుగారు దానిగురించి ఫోన్ కూడా చేయలేదు. నేను కూడా వదిలేశాను. ఆ మొత్తం 14 లక్షలు’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి : వీడియో: శృంగారంపై కరణ్ జోహార్ ప్రశ్న.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన కరీనా!