సినిమా థియేట్రికల్ రిలీజ్ అంటే పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. కానీ ఓటీటీ విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేకుండా విడుదల చేసేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక మూవీ డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి వస్తుందంటే జనాలు వెయిట్ చేస్తుంటారు.
సినిమా థియేట్రికల్ రిలీజ్ అంటే పబ్లిసిటీ ఏ రేంజ్లో ఉంటుందో తెలిసిందే. కానీ ఓటీటీ విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ లేకుండా విడుదల చేసేస్తున్నారు. సాధారణంగా ఏదైనా ఒక మూవీ డిజిటల్ ఫ్లాట్ఫామ్లోకి వస్తుందంటే జనాలు వెయిట్ చేస్తుంటారు. కానీ ఈ మధ్య నిఖిల్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘స్పై’ చడీ చప్పుడు లేకుండా స్ట్రీమింగ్ స్టార్ట్ చేసేశారు. ఇప్పుడు జగపతి బాబు ప్రధాన పాత్రలో నటించిన ‘రుద్రంగి’ కూడా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్, గానవి లక్ష్మణ్, ఆశిష్ గాంధీ తదితరులు ప్రధాన పాత్రధారులుగా, అజయ్ సామ్రామట్ దర్శకత్వంలో, రసమయి బాలకిషన్ భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన పీరియాడికల్ ఫిల్మ్ ‘రుద్రంగి’.
జూలై 7 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు తెలంగాణ దొరల నేపథ్యంలో లవ్, ఫ్యామిలీ స్టోరీస్ తీశారు కానీ ‘ఒసేయ్ రాములమ్మ’ తర్వాత దొరల బ్యాక్డ్రాప్ మాత్రం ఎవరూ టచ్ చెయ్యలేదు. చిన్నతనంలో తాను చూసిన సంఘటనల ఆధారంగా దర్శకుడు అజయ్ సామ్రాట్ ఈ ‘రుద్రంగి’ కథ రాసుకున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రీ రిలీజ్ ఈవెంట్కి అతిథిగా రావడంతో సినిమా జనాల్లోకి వెళ్లింది. థియేటర్లలోకి వచ్చిన మూడు వారాలకే ఓటీటీలో రిలీజ్ చేసేశారు. ఆగస్టు 1 నుంచి అమెజాన్ ప్రైమ్లో ‘రుద్రంగి’ స్ట్రీమింగ్ అవుతోంది.
ఆడవాళ్లంటే తెగ మోజు పడే భీమ్ రావ్ దేశ్ముఖ్ (జగపతి బాబు) భార్య మీరా భాయ్ (విమలా రామన్) గర్భవతిగా ఉండగా.. దొర బిడ్డ జ్వాలా భాయ్ (మమతా మోహన్ దాస్)ని రెండో పెళ్లాంగా తెచ్చుకుంటాడు. ఓ రోజు అడవిలో రుద్రంగి (గనవి లక్ష్మణ్)ని చూసి పిచ్చోడయిపోతాడు దొర. ఆమెను తీసుకురమ్మని మల్లేష్ (ఆశిష్ గాంధీ)కి చెప్తాడు. రుద్రంగి తన భార్య అని, చిన్నతనంలోనే పెళ్లి జరిగిందని చెప్పడంతో వదిలేస్తాడు. ఒకానొక టైంలో రుద్రంగి, మల్లేష్ ఆ ప్రాంతం విడిచి పారిపోతారు. దీంతో వారి ఆచూకీ చెప్పాలంటూ దొర ఊరి జనాలను నానా హింసలు పెడుతుంటాడు. చివరకి రుద్రంగి, మల్లేష్ ఇద్దరు దొరకు దొరికారా?.. దొర కోరిక తీరిందా?, రుద్రంగి సంస్థానం ఏమైంది? అనేది కథ.