సీనియర్ స్టార్ జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన బాలయ్య, యాంకర్ సుమపై సెటైర్స్ వేశారు.
యాంకర్ సుమ గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చెయ్యనక్కర్లేదు. మాతృభాష మలయాళం కంటే కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తెలుగు మాట్లాడుతుంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. నటిగా కెరీర్ స్టార్ట్ చేసి, టీవీ షోలు, ఈవెంట్స్ హోస్ట్ చేస్తూ టాప్ స్టార్ యాంకర్గా ఇప్పటికీ హవా కొనసాగిస్తున్నారు. ఇక సినిమా ఫంక్షన్కి సుమ యాంకరింగ్ చేస్తే ఆ సందడి వేరుగా ఉంటుంది. సుమ హోస్ట్ చేస్తుందంటే మెగాస్టార్ చిరంజీవి కూడా ఏం మాట్లాడాలో ప్రిపేర్ అయ్యే వస్తారు అని త్రివిక్రమ్ చెప్పడం చూస్తేనే ఆమె టాకింగ్ పవర్ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. దాదాపు పాతికేళ్ల తర్వాత ‘జయమ్మ పంచాయితీ’ మూవీతో నటిగా (మెయిన్ లీడ్) రీ ఎంట్రీ ఇచ్చిందామె. అంతకుముందు సాయి ధరమ్ తేజ్ ‘విన్నర్’ సినిమాతో సింగర్గా మారింది. అలాంటి సుమ మీద సినిమా ఈవెంట్లో పంచులు వెయ్యాలంటే ఎవరైనా కాస్త జంకుతారు ఎందుకంటే ఆమె తిరిగి ఎలాంటి కౌంటర్ ఇస్తుందో ఊహించలేరు కాబట్టి. కానీ నటసింహ నందమూరి బాలకృష్ణ మాత్రం సుమను ఆట పట్టిస్తూ సందడి చేశారు. ఆ న్యూస్, వీడియో ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. సీనియర్ స్టార్ జగపతి బాబు, విమలా రామన్, మమతా మోహన్ దాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘రుద్రంగి’. ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, ‘బిగ్ బాస్’ దివి తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీని రసమయి బాలకిషన్ నిర్మించారు. అజయ్ సమ్రాట్ దర్శకత్వం వహించారు. జగపతి బాబు భీమ్రావ్ దేశ్ముఖ్ అనే పవర్ఫుల్ క్యారెక్టర్ చేశారు. భారీ బడ్జెట్తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ‘రుద్రంగి’ జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూన్ 29న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీ ఎత్తున నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలయ్య బాబు ముఖ్య అతిథిగా విచ్చేసి, సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అలాగే వేదిక మీద సినిమా గురించి మాట్లాడే ముందు సుమను సరదాగా ఆట పట్టించారు బాలయ్య.
బాలయ్య మైక్ తీసుకోగానే ఫ్యాన్స్ ‘కోకోకోలా పెప్సీ, బాలయ్య బాబు సెక్సీ’ అంటూ అరిచారు. దీంతో తనను సెక్సీ అంటే సుమ, విమలా రామన్, మమతా మోహన్ దాస్ జలస్ ఫీలవుతారు అన్నాడు బాలయ్య. ఆ గోలలో సుమకి సరిగా వినిపించకపోవడంతో.. ఆమె పేరు తప్ప హీరోయిన్ల గురించి చెప్తూ.. ఈర్ష పడతారంటూ కవర్ చేసిన బాలయ్య.. ‘సుమకి అప్పుడప్పుడు చెంప దెబ్బలు అవసరం..కానీ ఇంకోటి జాగ్రత్తగా ఉండాలి.. చెప్పు దెబ్బలు కొడుతుంది.. పాపం ఆ రాజీవ్ కనకాల ఎలా భరిస్తున్నాడో’ అనగానే సుమ షాక్ అయింది. నవ్వుతూ బాలయ్యని చూస్తుండు పోయింది. ఇంతలో జగపతి బాబు మైక్ తీసుకుని సుమ బిజీగా ఉండడం వల్ల బాలయ్య బాబు డేట్ కూడా మార్చుకున్నారని చెప్పారు. తర్వాత సరదాగా ‘సీమసింహం’ లోని ‘పోరీ హుషారుగుందిరోయ్’ అనే లైన్ పాడి అలరించారు బాలయ్య. ప్రస్తుతం సుమ గురించి బాలయ్య చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.