తెలుగు సినిమా పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక మార్కు క్రియేట్ చేసుకున్నాడు గుణశేఖర్. చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్ వంటి కమర్షియల్ చిత్రాలతో పాటు.. రుద్రమదేవి, శాంకుతలం వంటి హిస్టారికల్ మూవీని కూడా తెరకెక్కించారు. ఇక గుణశేఖర్ సినిమాలు అంటే.. భారీ బడ్జెట్, సెట్స్తో విజువల్ ఫీస్ట్గా తెరకెక్కిస్తారు. ప్రస్తుతం గుణశేఖర్.. సమంత ప్రధాన పాత్రలో శాకుంతలం సినిమాతో బిజీగా ఉన్నారు. ఇక సినిమాల సంగతి పక్కన పెడితే.. తాజాగా గుణశేఖర్ ఇంట పెళ్లి బాజాలు మోగాయి. ఆయన కుమార్తె.. నీలిమా గుణ వివాహం జరిగింది. రామకృష్ణ పింజల, సత్య దంపతుల కుమారుడు రవి ప్రఖ్యాతో.. నీలిమా గుణ వివాహం జరిగింది.
దర్శకుడు గుణ శేఖర్ ప్రథమ కుమార్తె, శాకుంతలం చిత్ర నిర్మాత నీలిమా గుణ వివాహం డిసెంబర్ 2 రాత్రి 12 గంటల 31 నిమిషాలకు (తెల్లవారితే శనివారం) అంగరంగ వైభవంగా జరిగింది. ప్రముఖ విద్యావేత్త, వ్యాపారవేత్త, ఎంటర్ ప్రెన్యూరర్, శ్రీ శక్తి గ్రూప్ అధినేత అయిన డాక్టర్ రామకృష్ణ, సత్య పింజల దంపతుల కుమారుడు రవి ప్రఖ్యాతో నీలిమా గుణ వివాహం జరిగింది. హైదరాబాద్లోని తాజ్ ఫలక్ నామా ప్యాలెస్లో ఈ వివాహ వేడుక జరిగింది. తల్లిదండ్రులు, బంధుమిత్రుల సమక్షంలో.. నీలిమ, రవి ఇద్దరు ఏడు అడుగులు వేసి.. వివాహబంధంలోకి అడుగుపెట్టారు. వివాహం తర్వాత రిసెప్షన్ వేడుక నిర్వహించారు.
ఇక రిసెప్షన్ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు. ఇర మెగాస్టార్ చిరంజీవి దంపతులు వేడుకకు హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదించారు. అల్లు అరవింద్, దర్శకుడు అనిల్ రావిపూడి, దర్శకడు మెహర్ రమేష్, తెలంగాణ మినిస్టర్ తలసాని శ్రీనివాస యాదవ్ సహా పలువురు ప్రముఖులు ఈ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రస్తుతం నీలిమా గుణ తండ్రి గుణ శేఖర్ తెరక్కిస్తోన్న శాకుంతలం సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది దుష్యంతుడు, శకుంతల మధ్య నడిచిన ప్రేమ గాథ. ఈ పౌరాణిక గాథను గుణ శేఖర్ అందమైన.. విజువల్ ఫీస్ట్గా ఉండే లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాలో సమంత శకుంతలగా నటిస్తుంటే.. దుష్యంతుడి పాత్రలో మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది.