పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు అభిమానులు. విడుదలైన రోజు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా థియేటర్లలో, సోషల్ మీడియాలో సందడి ఉంటుంది.
పెద్ద హీరోల సినిమా వస్తుందంటే చాలా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తుంటారు అభిమానులు. విడుదలైన రోజు వారు చేసే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమా థియేటర్లలో, సోషల్ మీడియాలో సందడి ఉంటుంది. సినిమా సూపర్ హిట్ అయితే ఓకే. కానీ ప్లాప్ అయితే.. అప్పుడు మొదలవుతుంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విషయంలో కూడా ఇదే జరిగింది. మెగాస్టార్ ఈ మధ్య ఎక్కువగా రీమేక్ ల మీద దృష్టి పెట్టి ఫ్లాప్ లు మూటకట్టుకుంటున్నాడు. వేరె దగ్గర హిట్ అయ్యింది కదా అని ఇక్కడ కూడా అలాగే హిట్ అవ్వుద్దిలే అనుకుంటే పొరపాటే.. అంత కన్న పెద్ద తప్పు ఇంకోటి ఉండదు. మన వాళ్ళకు టేస్ట్కు తగ్గట్టు తీస్తేనే సినిమాను ఆధారిస్తారు. ఈ విషయం ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది. లేదంటే తెలుగు సినీ పరిశ్రమకు చెడ్డరోజులు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నయని చెప్పొచ్చు.
ఇటీవలే రిలీజైన చిరంజీవి భోళా శంకర్ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు. ఈ సినిమా కనీస వసుళ్ళు రాబట్టడం కూడా గగనమైపోయింది. ఫలితంగా భోళా శంకర్ డిజాస్టర్గా నిలిచింది. దీంతో మెగా ఫ్యాన్స్ నిరాశచెందారు. దీంతో డైరెక్టర్ మెహర్ రమేష్ను ఓ అటాడుకున్నారు కొందరు నెటిజన్లు. ఈ క్రమంలో చిరు నెక్స్ట్ మూవీ ఎవరితో అన్న చర్చ జరుగుతుంది. అయితే చిరంజీవి లిస్ట్ లో నలుగురు డైరెక్టర్స్ ఉన్నారని ఫిల్మ్ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బింబిసార దర్శకుడు వశిష్టతో ఓ సినిమా చేయనున్నట్లు ప్రచారం ఊపందుకుంది. అలాగే బంగార్రాజు డైరెక్టర్ కళ్యాన్ కృష్ణతోనూ ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమచారం.
దీన్ని మెగా డాటర్ సుష్మిత కొనిదల నిర్మించనుందంటూ ఓ వార్త వైరల్ అవుతుంది. అంతే కాదు వినాయక్, పూరి జగన్నాథ్, వంటి ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి. మరి ఇందులో చిరంజీవి ఏ డైరెక్టర్స్ తో వర్క్ చేస్తారో చూడాలి. బర్త్డే అగస్టు 22న చిరు నెక్స్ట్ మూవీ అప్ డేట్ వదులుతాడా.. లేదా.. అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ సారైనా రీమేక్ లు పక్కన పెట్టి ఒరిజినల్ స్టోరీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.