”ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర శత్రవు ఎవరో తెలుసా!
నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడు”…
అంటూ ‘ప్రకాష్ రాజ్’ వాయిస్ ఓవర్ తో క్రేజీ మాల్టీస్టారర్ మూవీ ఒకటి రెడీ అవుతోంది. అక్కడ స్టార్ హీరో విశాల్ మరో స్టార్ ఆర్యతో కలిసి చేస్తున్న సినిమా ‘ఎనిమీ’. ఈ సినిమాను ఆనంద్ శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుండి టీజర్ లేటెస్ట్ గా రిలీజైంది. యాక్షన్ థ్రిల్లర్ గా సినిమా టీజర్ మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ తో నింపేశారు. ఈ సినిమాలో మృణాళిని రవి, మమతా మోహన్ దాస్ హీరోయిన్స్గా నటించారు.
మినీ స్టూడియోస్ పతాకంపై వినోద్ కుమార్ ఈ సినిమాకు సమర్ఫకుడిగా వ్యవహరిస్తున్నారు. తమిళంలో పాటు తెలుగులో మంచి మార్కెట్ ఉన్న విశాల్ ., ఆర్య ‘అవన్ ఇవన్’ (వాడు…వీడు) సినిమాలో కలిసి నటించారు. ఆ తర్వాత ఆర్య నటించిన ‘ఐశ్వర్యాభిరస్తు’ సినిమాలో విశాల్ అతిథి పాత్రలో మెరిసాడు. వీళ్లిద్దరు ‘ఎనిమి’ సినిమాలో మరోసారి ఢీ అంటే ఢీ అనబోతు న్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్లో విడుదల చేస్తున్నట్టు టీజర్లో చూపెట్టారు.
ఈ సినిమా షూటింగ్లో ఆర్య గాయపడ్డాడు. ఆ తర్వాత కోలుకొని కొన్ని యాక్షన్ సన్నివేశాలను పూర్తి చేశారు. మరోవైపు విశాల్ కూడా ఈ సినిమా షూటింగ్లో గాయాలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మిస్కిన్ దర్శకత్వంలో చేయాల్సిన ‘తుప్పారివాలన్’ (డిటెక్టివ్ 2) సినిమా ఆగిపోయింది. దర్శకుడికి విశాల్కు మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమా బాధ్యతలను విశాల్ టేకప్ చేశాడు.