రాధే శ్యామ్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కే, డైరెక్టర్ మారుతీతో కామెడీ ఎంటర్టైనర్ ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. రాధే శ్యామ్ ప్లాప్ ప్రభావం ప్రభాస్ పై ఇసుమంత కూడా పడలేదని అంటున్నాయి సినీవర్గాలు. ఎందుకంటే.. రాధే శ్యామ్ రిలీజ్ ముందునుండే అందరి చూపు తదుపరి సినిమా సలార్ పై పడింది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా అన్నప్పుడే అంచనాలు పీక్స్ కి చేరుకున్నాయి.
ఇక ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ ఏప్రిల్ 14న రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 2 ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్ కి ‘సలార్‘ మూవీ గురించి ప్రశ్న ఎదురైంది. తాజా ప్రెస్ మీట్ లో ఓ లేడీ రిపోర్టర్ మాట్లాడుతూ.. “ఏప్రిల్ 14న కేజీఎఫ్ 2 రిలీజ్ అవుతోంది. కాబట్టి అదేరోజున సలార్ గ్లింప్స్ ఎక్సపెక్ట్ చేయొచ్చా?” అడిగింది.ఆ ప్రశ్న విన్న వెంటనే ప్రశాంత్ నోటమాట రాలేదు. ఆయన స్పందిస్తూ.. ‘నాకేం తెలియదు. మీరు నిర్మాతలను అడిగితే బాగుంటుంది’ అంటూ బదులిచ్చాడు. మరి ఈ విషయంలో ప్రశాంత్ నీల్ సైడ్ నుండి సమాధానం వచ్చినట్లే. మరి నిర్మాతలు సలార్ గ్లింప్స్ పై ఎలా స్పందిస్తారో చూడాలని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. నిజానికి సలార్ గ్లింప్స్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఆడియెన్స్ ఆసక్తిగా ఉన్నారు. సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ కాగా విజయ్ కిరగందుర్ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సలార్ సినిమా అయినా ప్రభాస్ కి మర్చిపోలేని గిఫ్ట్ అవుతుందేమో చూడాలి. మరి సలార్ కోసం మీరెలా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి.