ప్రముఖ చిత్ర దర్శకుడు పరశురాం గురించిన కొన్ని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్కు కోట్ల రూపాయు బాకీ పడ్డారట.
‘గీతా గోవిందం’ సినిమాతో స్టార్ డైరెక్టర్గా మారిపోయారు పరశురాం. గీతా గోవిందం తర్వాత ఆయన దర్శకత్వం వహించిన ‘సర్కారు వారి పాట’ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పరశురాం వ్యవహార శైలిపై ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అసహనం వ్యక్తం చేశారు. తాజాగా, 2018 సినిమా ప్రెస్ మీట్లో అల్లు అరవింద్ పరోక్షంగా పరశురాంపై వ్యాఖ్యలు చేశారు. తనను కొంతమంది దర్శకులు మోసం చేశారని అన్నారు. తన ద్వారా పైకొచ్చి చాలా మంది గీత దాటి వెళ్లిపోయారని అన్నారు. పేరు చెప్పకుండానే పరశురాంపై అసహనం వ్యక్తం చేశారు.
అల్లు అరవింద్ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ తరుణంలోనే దర్శకుడు పరశురాం గురించి మరో పుకారు షికారు చేస్తోంది. ఆయన ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్కు 13 కోట్ల రూపాయలు బాకీ ఉన్నారట. ప్రచారంలో ఉన్న సమచారం ప్రకారం.. 14 రీల్స్ సంస్థలో నాగ చైతన్య, పరశురాం కాంబినేషన్లో ఓ సినిమా చేయాల్సి ఉండింది. అయితే, మహేష్ బాబు సినిమా కోసం పరశురాం ఈ సినిమాను వదులుకున్నారు. ఆ తర్వాత చైతన్యతో చేయాల్సిన స్టోరీ వర్కవుట్ కాలేదు. ఈ నేపథ్యంలోనే పరశురాం తమిళ స్టార్ హీరో కార్తీకి ఒక కథ చెప్పి.. ఓకే చేయించుకున్నారు.
ఈ సినిమాను 14 రీల్స్ నిర్మించాల్సి ఉంది. అయితే, ఈ సినిమాను నవంబర్ లేదా జనవరిలో చేస్తానని కార్తీ చెప్పారట. ఈ గ్యాప్లో పరశురాం.. కార్తీ సినిమా పక్కన పెట్టి.. విజయ్ దేవరకొండ- దిల్ రాజుతో సినిమా స్టార్ట్ చేశారు. దీంతో కార్తీ కూడా పరశురాంతో సినిమా చేయటానికి నిరాకరించారట. తద్వారా ఆ రెండు ప్రాజెక్ట్లకు సంబంధించి పరశురాం 14 రీల్స్ సంస్థకు రూ. 13 కోట్లు బకాయి పడ్డట్లు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక, ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలంటే 14 రీల్స్ సంస్థనుంచి కానీ, పరశురాం నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే. మరి, 14 రీల్స్కు డైరెక్టర్ పరశురాం కోట్ల రూపాయలు బాకీపడ్డారని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.