ఎమ్మెస్ ధోని వైఫ్ సాక్షిసింగ్ ధోని అల్లు అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తమ బ్యానర్లో తెరకెక్కిన సినిమా ప్రమోషన్లో పాల్గొన్న సాక్షి సింగ్ ధోని అల్లు అర్జున్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.
టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ క్రికెట్ చరిత్రలో సువార్ణాక్షరాలతో లిఖించదగ్గ పేరు. తన సారథ్యంలో భారత్ కు అన్ని ఫార్మాట్లలో ఎన్నో విజయాలను అందించిన ఘనతను దక్కించుకున్నారు. 2007 ప్రపంచ కప్ సాధించడంలో కీలకపాత్ర వహించాడు ఎమ్మెస్ ధోని. టీమిండియా కెప్టెన్ గా, వికెట్ కీపర్ గా, బ్యాట్ మెన్ గా అత్యుత్తమ స్థాయిలో రాణించి క్రికెట్ ప్రియుల మధిలో చెరగని ముద్ర వేశారు. కాగా ధోనీ మరో రంగంలో తన సత్తా చాటేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే ధోనీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించారు. సినీ రంగంలో తన లక్ ను పరీక్షించుకోబోతున్నారు. ఇదిలా ఉంటే ధోని వైఫ్ సాక్షి సింగ్ ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా మాట్లాడుతూ.. అల్లు అర్జున్ సినిమాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది
భారత క్రికెట్ లో దిగ్గజ క్రికెటర్ గా పేరొందిన ఎమ్మెస్ ధోని సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తున్నారు. దీనిలో భాగంగా మొదటి సినిమాగా LGM ను నిర్మించారు. దర్శకుడు రమేష్ తమిళమణి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా ఈ సినిమాలో నటీనటులుగా హరీష్ కళ్యాణ్, ఇవానా జంటగా నటిస్తున్నారు. కాగా ఈ సినిమా ఈ నెల 28న గ్రాండ్ గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే LGM సినిమాను తెలుగులో కూడా విడుదల చేయనున్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రమోషన్స్ ప్రారంభించారు. ఈ ప్రమోషన్స్ కు ధోని వైఫ్ సాక్షి సింగ్ ధోని హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో తెలుగు సినిమాలు చూస్తారా అని ప్రశ్నించగా.. దీనికి సాక్షి సింగ్ ధోని స్పందిస్తూ.. పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ సినిమాలు మాత్రమే చూస్తానని స్పష్టం చేసింది. అల్లు అర్జున్ సినిమాలంటే తనకు ఎంతో ఇష్టమని తన సినిమాలను మిస్ కాకుండా చూస్తానని వెల్లడించింది. ఓటీటీ లేని రోజుల్లోనే అల్లు అర్జున్ సినిమాలు చూసేదాన్నని, ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని వెల్లడించింది. గోల్డ్ మైన్ ప్రొడక్షన్ వాళ్లు యూట్యూబ్ లో తెలుగు సినిమాలన్నింటిని హిందీలోకి అనువదించేవారని దీంతో అల్లు అర్జున్ సినిమాలు చూసే అవకాశం దక్కిందని తెలిపింది. అల్లు అర్జున్ కు తాను వీరాభిమానినని సాక్షి సింగ్ ధోని తెలిపింది.