వెండితెర మాత్రమే కాదు.., ఇప్పుడు బుల్లితెర కూడా ఓ రంగుల ప్రపంచం అయిపోయింది. స్టార్ హీరోయిన్స్ నుండి కొత్త అందాల వరకు ఇప్పుడు అంతా టెలివిజన్ షోలలోనే దర్శనం ఇస్తున్నారు. ఇక తెలుగనాట ఇలాంటి టెలివిజన్ షో అనగానే ముందుగా గుర్తుకి వచ్చేది ఢీ డ్యాన్స్ షో. సౌత్ ఇండియన్ డ్యాన్స్ షోలలో ఢీది బాహుబలి స్థాయి అని చెప్పుకోవచ్చు.
ఇంత రేంజ్ ఉంది కాబట్టే.. ఈ షో సీజన్ సీజన్ కి తన రీచ్ పెంచుకుంటూ పోతోంది. అయితే.., ఢీ షోలో ఇప్పుడు ప్రేమ జంటల హంగామా ఎక్కువై పోయింది. నిన్న మొన్నటి వరకు జడ్జెస్, యాంకర్స్, టీమ్ లీడర్స్ మధ్య మాత్రమే ఉన్న చిలకకొట్టుడు వ్యవహారం ఇప్పుడు కంటెస్టెంట్స్ మధ్యకి కూడా పాకిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
ప్రస్తుతం ఢీ లో 13వ సీజన్ నడుస్తోంది. కింగ్స్ vs క్వీన్స్ అనే కాన్సెప్ట్ తో నడుస్తున్న ఈ షోలో కంటెస్టెంట్స్ కూడా హీరోయిన్ రేంజ్ లో స్టేజ్ పై అందాలు ఆరబోస్తున్నారు. ఇదే సమయంలో డ్యాన్స్ మాస్టర్స్ తో రెచ్చిపోయి స్టెప్పులు వేస్తున్నారు. అయితే.., ఇదంతా ఆన్ స్క్రీన్ వరకు పరిమితం అనుకుంటే పోరపడినట్టే. ఆఫ్ స్క్రీన్ లోను వీరి మధ్య కెమిస్ట్రీ ఓ రేంజ్ లో నడుస్తోందట. ఇందుకు తాజాగా విడుదలైన ఢీ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో సాక్ష్యంగా నిలిచింది.
తాజా ప్రోమోలో నైనిక, సాయి టీమ్ డ్యాన్స్ హైలెట్ గా నిలిచింది. తరువాత నైనిక, సాయి ఓ రొమాంటిక్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇందులో వీరి మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. అయితే.., నైనిక, సాయిల మధ్య ఉన్న ప్రేమని బయట పెట్టే ప్రయత్నం చేశారు జడ్జెస్. సాయి ఎందుకు నైనాని చూస్తే అంత భయపడుతున్నావ్ అని ప్రశ్నించారు. దీనికి సాయి..
“ఎంతో చెప్పాలని అనుకుంటాను, దగ్గరికి వెళ్లి నైనా కళ్లలోకి చూసే సరికి అంతా మరిచిపోతాను అని చెప్పడంతో అంతా షాక్ అయిపోయారు. అయితే.. ఇందుకు నైనా ఇచ్చిన సమాధానం జడ్జెస్ కి సైతం దిమ్మ తిరిగిపోయేలా చేసింది. “చాటింగ్, ఫోన్ కాల్స్లో రొమాన్స్ చేస్తాడు.. ఇక్కడ చేయడం లేదు.. వాడే నర్వస్గా ఫీల్ అవుతున్నాడు” అని నైనిక అసలు విషయం బయట పెట్టేసింది. దీంతో అవాక్కవడం అందరి వంతు అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో తెగ వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ ప్రోమోపై ఓ లుక్ వేసేయండి.