కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్ – ఐశ్వర్య.. ఇటీవల తమ 17 ఏళ్ల వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇది జరిగి చాలా రోజులు గడిచినా అభిమానులు మాత్రం ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇద్దరూ ఎందుకు విడిపోయారో చెప్పలేదు కానీ.. విడిపోయినా మంచి స్నేహితులుగా ఉంటామని చెప్పారు. ప్రస్తుతం ఐశ్వర్య – ధనుష్ ఎవరి కెరీర్ లో వారు బిజీగా ఉన్నారు.
ఇక వీరిద్దరూ ట్వీట్ లతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఎందుకంటే.. తాజాగా ఐశ్వర్య ‘పయని‘ అనే మ్యూజిక్ వీడియోను రూపొందించింది. ఈ మ్యూజిక్ వీడియోని తమిళంలో సూపర్ స్టార్ రజినీకాంత్ రిలీజ్ చేయగా, తెలుగులో ‘సంచారి’ పేరుతో అల్లు అర్జున్ రిలీజ్ చేశారు, మలయాళంలో మోహన్ లాల్ రిలీజ్ చేశారు. చాలా ఏళ్ళ తర్వాత ఐశ్వర్య ఈ మ్యూజిక్ వీడియో కోసం మెగాఫోన్ పట్టుకుంది. అయితే.. ఐశ్వర్య పయని వీడియో సాంగ్ పై ధనుష్ ట్వీట్ చేయడం ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
“పయని మ్యూజిక్ వీడియో కోసం కంగ్రాట్స్ మై ఫ్రెండ్.. ఐశ్వర్య! గాడ్ బ్లెస్ యూ” అని ధనుష్ మాజీ భార్య వీడియో సాంగ్ పై ట్వీట్ చేశాడు. ఇక మాజీ భర్త ట్వీట్ పై ఐశ్యర్య స్పందించి ‘థాంక్యూ ధనుష్’ అని రీట్వీట్ చేసింది. అయితే.. విడాకుల అనంతరం ఐశ్వర్య గురించి ధనుష్ ట్వీట్ చేయడం, ఐశ్వర్య కూడా తన పేరులో ధనుష్ పేరు ఇంకా తొలగించకపోవడం పై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Thank you Dhanush….Godspeed https://t.co/XyP9lmnX3P
— Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) March 17, 2022