తెలుగు ఇండస్ట్రీలో అలా వచ్చి ఇలా కనిపించకుండా వెళ్లిపోయిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. ఆ కోవకు చెందినవారిలో దీక్షా సేత్ ఒకరు. ఈ ఢిల్లీ భామ గురించి పేరు చెబితే గుర్తుపట్టకపోవచ్చు. కానీ.. రెబల్, వేదం, నిప్పు, మిరపకాయ్ సినిమాలలో హీరోయిన్ గా నటించిందంటే ఇట్టే గుర్తుపడతారు. చదువుకునే రోజుల్లోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన దీక్షా.. హైదరాబాద్ లో ఓ మోడలింగ్ అసైన్మెంట్ కోసం పని చేస్తున్న టైంలో డైరెక్టర్ క్రిష్ కంటపడింది.
ఆ వెంటనే డైరెక్టర్ వేదం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. అదికూడా అల్లు అర్జున్ కి జంటగా కనిపించేసరికి బన్నీ ఫ్యాన్స్ సైతం దీక్షాకు ఫ్యాన్స్ అయిపోయారు. ఇక వేదం సినిమా మంచి హిట్ అవ్వడంతో రవితేజ సరసన మిరపకాయ్, గోపీచంద్ సరసన వాంటెడ్ సినిమాలు ఓకే చేసింది. అందులో మిరపకాయ్ ఆడినా.. వాంటెడ్ నిరాశపరిచింది. ఆ తర్వాత కూడా దీక్షా చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదని చెప్పాలి.
దీంతో తెలుగులో చివరగా రెబల్(2012), హిందీలో సాత్ కడమ్ (2016) సినిమాలలో నటించి మళ్లీ ఇండస్ట్రీలో కనిపించలేదు. అయితే.. ఇండస్ట్రీకి దూరమైనా.. హీరోయిన్స్ ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటారు. కానీ.. దీక్షా అలా కాదు. సోషల్ మీడియాలో రేర్ గా పోస్టులు పెడుతుంది. చివరిసారిగా ప్రభాస్ సరసన కనిపించిన దీక్షా.. తాజాగా సోషల్ మీడియాలో బికినీ ఫోటోలు పోస్ట్ చేసి షాకిచ్చింది. ప్రస్తుతం దీక్షా బికినీ ఫోటోలపై ఫ్యాన్స్ లైక్స్ వర్షం కురిపిస్తున్నారు. మరి వైరల్ అవుతున్న దీక్షాసేథ్ కొత్త ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.