జులై 14న భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో చంద్రయాన్ 3 రాకెట్ను దిగ్విజయంగా ప్రయోగించింది. జాబిల్లి గుట్టు విప్పేందుకు చంద్రయాన్-3 ని
భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో.. జులై 14న తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో గల సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన సంస్థ నుంచి చంద్రయాన్ 3 రాకెట్ను నింగిలోకి నిప్పులు చిమ్ముకుంటూ నింగివైపు దూసుకెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ఇస్రో మరో ఘనతను సాధించింది. ఆగస్టు 23 లేదా 24 తేదీల్లో చంద్రుడిపై ల్యాండ్ అవుతుందని అంటున్నారు. అంతా బాగానే ఉన్నా.. ఆస్ట్రేలియాలోని జురియన్ బే బీచ్లో ఓ మిస్టీరియస్ వస్తువు కనిపించడం.. అది భారత్ పంపించిన చంద్రయాన్ -3 రాకెట్ శకలం అంటూ ప్రచారం మొదలైంది. తాజాగా దీనిపై ఇస్రో క్లారిటీ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్-3 వ్యోమనౌక ఎల్వీఎం3-ఎం4 విజయవంతంగా కక్ష్యవైపు దూసుకెళ్లింది. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా సముంద్ర తీరంలో ఓ అంతుచిక్కని వస్తువు తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ ఆస్ట్రేలియాలోని గ్రీన్ హెడ్ పట్టణం తీరంలో రాగితో చేసిన డ్రమ్ము ఆకారంలో ఉన్న ఆ వస్తువు కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రయాన్-3 ఆస్ట్రేలియా గగనతలంలో ప్రయాణించిన నేపథ్యంలో రాకెట్ నుంచి కింద పడ్డ శకలం అయి అనుమానిస్తున్నారు. ఈ వార్తలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. కాకపోతే దీన్ని ఆస్ట్రేలియన్ స్పేస్ ఏజెన్సీ ధ్రువీకరించలేదు.
ఆస్ట్రేలియా సముద్ర తీరంలో కనిపించిన వస్తువుపై భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం ఇస్రో స్పందించింది. తాజాగా ఇస్త్రో చీఫ్ సోమనాథ్ స్పందించారు. ‘మేము ఆ వస్తువును పరిశీలించకుండా అది మాదేనా? కాదా? అని ఎలా తేల్చి చెప్పగలం అని అన్నారు. అయితే ఆ శకలం ఖచ్చితంగా రాకెట్ దే అని.. అయితే అది భారత్ కు చెందిన రాకెట్ ది కావొచ్చు.. కాకపోవొచ్చు’ అని అన్నారు. కాగా, ఆస్ట్రేలియా సముద్ర తీరంలో కనిపించిన ఈ భారీ శకలానికి దూరంగా ఉండాలంటూ స్థానికులను అక్కడి అధికారులు హెచ్చరించారు.
Chandrayaan-3 debris fell on Australian beach? Mystery object sparks curiosity https://t.co/D0xykkvn3E https://t.co/D0xykkvn3E
— Realtimeindia (@Realtime_india) July 18, 2023