తెలుగు ఇండస్ట్రీలో ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ పృథ్వీరాజ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో కమెడియన్ గా కొనసాగుతున్నాడు. అప్పుడప్పుడు కెరీర్ పరంగా స్లో అయినా మళ్లీ ఎలాగో అవకాశాలు దక్కించుకుంటూ కంటిన్యూ అవుతున్నాడు. అయితే ఆ మధ్యన పృథ్వీరాజ్ రాజకీయాల్లో చేరి వైసీపీ పార్టీ ప్రచారంలో భాగంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై భారీ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అదే విషయం పై ఆడియో టేపు లీక్ అవ్వడంతో పృథ్వీ ఇమేజ్ దారుణంగా డ్యామేజ్ అయింది.
ఇక మళ్లీ సినిమాల్లో కనిపించడేమో అని అంతా అనుకున్నారు. కానీ ప్రయత్నాలు చేసి ఎలాగో మళ్లీ సినిమాల్లో బిజీ అయిపోయాడు. అయితే మెగా ఫ్యామిలీ పై రాజకీయ పరంగా ఎన్ని విమర్శలు గుప్పించినా సినిమా అవకాశాలు ఇస్తూనే వచ్చారు. ఒకానొక సమయంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా పలు సినిమాలకు తన పేరు రికమండ్ చేశాడని పృథ్వీ ఆ మధ్య చెప్పుకొచ్చాడు. ఈ విషయాలన్నీ పృథ్వీ పలు ఇంటర్వ్యూలో కూడా బయట పెట్టాడు.
తాజాగా పృథ్వీ షేర్ చేసిన పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. అన్నయ్యతో తమ్ముడు.. అనే టాగ్ లైన్ జోడించి ఎంతో వినయంగా నిల్చున్నాడు పృథ్వీ. ఫోటో అయితే వైరల్ అవుతోంది.. కానీ పృథ్వీ పై ట్రోల్స్ మాత్రం ఆగటం లేదు. అవకాశాలు లేకపోయే సరికి మెగాస్టార్ గుర్తొచ్చాడు.. మా మెగాస్టార్ ఎవరినైనా అక్కున చేర్చుకుంటాడు.. లాంటి ట్రోల్స్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. పృథ్వీరాజ్ చిరుతో కలిసి పెట్టిన పిక్ పై మీ అభిప్రాయాలు కామెంట్స్ చేయగలరు.