సినిమా తీయడం అనేది అంత ఆషా మాషి వ్యవహరం కాదు. సినిమా తెరకెక్కించాలంటే చాలా డబ్బు అవసరం అవుతోంది. దర్శకుని బట్టి, హీరోలను బట్టి సినిమా బడ్జెట్ ఉంటుంది. అయితే చిత్ర బృందాలు వందల కోట్లు వెచ్చించి తమ సినిమాలోని సన్నివేశాలు అందంగా తెరకెక్కించడానికి ప్రయత్నిస్తుంటారు. ఈక్రమంలో కొన్ని ప్రాంతాల్లో షూటింగ్ చేయాలంటే సంబంధింత వ్యక్తి, శాఖల అనుమతి తప్పనిసరి తీసుకోవాలి. దీనికోసం కొంత మొత్తం లో డబ్బులు చెల్లిస్తుంటారు. ఇండియన్ రైల్వే శాఖకు కూడా అలాగే సినిమాల ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతుంది. తాజాగా మధ్య రైల్వే శాఖకు సినిమా షూటింగ్ ల ద్వారా రూ. 2.48 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ విషయాన్ని మధ్య రైల్వే శాఖ అధికారి శివాజి సుతర్ తెలిపారు.
2021-22 ఆర్ధిక సంవత్సరానికిగాను మధ్యరైల్వేశాఖ సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని ప్రకటించింది. మధ్య రైల్వే కేంద్రం పరిధిలోని పలు స్టేషన్లలో సుమారు 10 సినిమాలు చిత్రీకరించబడ్డాయి. ఇందులో 6 చలన చిత్రాలు, రెండు వెబ్ సిరీస్ లు ఉన్నాయి. వీటి ద్వారా మొత్తం రూ.2.48 కోట్లు వచ్చింది. ఈ ఆదాయం అమీర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కిస్తున్న ఓ కొత్త చిత్రం నుంచి వచ్చింది. కిరణ్ రావు గతంలో ‘ధోబీ ఘాట్’ చిత్రానికి దర్శకత్వం వహించి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు మరో సినిమాకు యాక్షన్ చెబుతున్నారు. ఈ చిత్రంలోని ” ఇద్దరు పెళ్లి కూతుర్లు” అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ టైటిల్ గురించి చిత్ర బృందం నుంచి ఎలాంటి సమాచారం లేదు.
అయిత్ కిరణ్ రావు తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి సంబంధించి మొత్తం 50 రోజుల షూటింగ్ జరింగింది. అందులోనూ రైల్వే స్టేషన్ కు సంబంధించిన లోకేషన్లలో దాదాపు 18 రోజుల పాటు షూటింగ్ జరిగింది. రూ.1.27 కోట్లు చెల్లించి ఆ లోకేషన్లో చిత్రీకరణ అనుమతులు తీసుకున్నట్లు టాక్. మధ్య రైల్వే కేంద్రానికి మొత్తం ఆదాయం రూ.2.48 కోట్లు అయితే అందులో సగం రూ.1.27 కోట్లు కిరణ్ రావు తెరకెక్కిస్తున్న చిత్రం నుంచి వచ్చింది. అయితే అన్ని రోజులు రైలుకు సంబంధించిన సీన్స్ ఎందుకని, ఈసినిమా కథకు రైలుకు సంబంధం ఏంటనీ సినీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.