చిరంజీవి నటించిన భోళా శంకర్ సినిమా రిలీజ్ కి సిద్ధమైంది. రెండు రోజుల్లో రచ్చ షురూ అవుతుందని ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్ పై పిటిషన్ వేశారు.
స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే ఫ్యాన్స్ కి పూనకాలు రావాల్సిందే. అదే సమయంలో నిర్మాతలకు మాత్రం చెమటలు పడతాయి. ఎందుకంటే థియేటర్లో బొమ్మ పడే వరకూ నిర్మాతలు టెన్షన్తోనే ఉంటారు. ఎటు నుంచి ఏ వివాదం వస్తుందో తెలియదు, ఫ్యాన్స్ మధ్య గొడవలు జరిగి సినిమా అగిపోతుందో తెలియదు. ఇలా చాలా సమస్యలు ఉంటాయి. అయితే తాజాగా భోళా శంకర్ సినిమా విషయంలో నిర్మాతకు కొత్త చిక్కులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం భోళా శంకర్. మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్తో సందడి చేస్తు సినిమాపై మరింత బజ్ పెరిగేలా చూసుకుంటున్నారు.
అంతా బాగానే ఉందనుకున్న టైమ్ లో ఒ కొత్త సమస్య ఎదురైంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అఖిల్ నటించిన ‘ఏజెంట్’ భారీ అంచనాల నడుమ విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకొని అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. అంతే కాక నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్స్తో సహ ప్రతి ఒక్కరు తీవ్రంగా నష్టపోయారు. అయితే విశాఖపట్నంకు చెందిన ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూటర్ బత్తుల సత్యనారాయణ (వైజాగ్ సతీష్) భోళా శంకర్ నిర్మాతపై కేసు వేశారు. ఏజెంట్ మూవీ విషయంలో నిర్మాతలు అనిల్ సుంకర, గరికపాటి కృష్ణ కిషోర్ తనను నమ్మించి మోసం చేశారని అన్నారు. ఏజెంట్ సినిమా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఐదు సంవత్సారాల పాటు తన గాయత్రి దేవి ఫిలిమ్స్కు అందజేస్తూ.. నిర్మాతలు తన నుంచి 30 కోట్ల రూపాయలు తీసుకొని అగ్రిమెంట్ రాసిచ్చారని అన్నారు. అయితే విడుదల సమయంలో తనకు కేవలం విశాఖపట్నం జిల్లా వరకు మాత్రమే డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఇచ్చారని అన్నారు.
సామజవరగమన చిత్రం డిస్ట్రిబ్యూషన్ హక్కుల విషయంలో కూడా ఇలాగే జరిగిందని చెప్పారు. అయితే దాని నుంచి కొద్ది డబ్బు మాత్రమే తనకు కవర్ అయ్యిందని.. మిగిలిన బ్యాలెన్స్ 54 రోజుల్లో ఇస్తామని చెప్పి.. ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వడం లేదని వాపోయారు. అయితే ఎన్నిసార్లు చెప్పినా తన బాధను అర్థం చేసుకోలేదని అన్నారు. భోళా శంకర్ సినిమా హక్కులు తనకు చెప్పకుండా వేరే వారికి అమ్మేశారని.. సినిమా రిలీజ్ ని ఆపాలంటూ కేసు వేసినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. తన మీద నిర్మాతలు ఫోర్జరీ నింద వేశారని.. అందుకే ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న భోళా శంకర్ రిలీజ్ పై కేసు వేసినట్టు డిస్ట్రిబ్యూటర్ సతీష్ వెల్లడించినట్లు ప్రచారం జరుగుతుంది. మరి దీనిపై కోర్టు ఎటువంటి తీర్పు ఇస్తుందో చూడాలి.
#Agent distributor Gayatri Satish filed a petition on producer #AnilSunkara. He bought entire Andhra Pradesh and KA rights for 30Cr NRA and only 1.5Cr recovered till now and the producer sold #BholaShankar to another distributor without informing him.
— TrackTollywood (@TrackTwood) August 8, 2023