కామెడీ బ్రహ్మ బ్రహ్మానందం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఏళ్ల తరబడి.. ప్రేక్షకులను తన హాస్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు బ్రహ్మానందం. తెర మీద ఆయనను చూడగానే.. ప్రేక్షకుల ముఖాల మీద నవ్వులు పూస్తాయి. ఏళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీలో టాప్ కమెడియన్గా రాణిస్తున్నాడు బ్రహ్మానందం. ఇక ఆయన కుమారుడు గౌతమ్ హీరోగా పరిచయం అయ్యాడు.. కానీ అనుకున్న మేర రాణించలేదు. ఇక బ్రహ్మానందం గత కొంత కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. ఆరోగ్య కారణాల రిత్యా.. ప్రస్తుతం సినిమాలు తగ్గించారు. ఇక బ్రహ్మానందం కమెడియన్ మాత్రమే కాక.. ఆయనలో మంచి ఆర్టిస్ట్ కూడా ఉన్నాడు. పెన్సిల్ పట్టుకుని.. ఆయన చెక్కె చిత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఇవన్ని పక్కకు పెడితే.. బ్రహ్మానందం ఇంట సంబరాలు మొదలయ్యాయి. ఆయన మరోసారి తాతైనట్లు తన సంతోషాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆ వివరాలు..
బ్రహ్మానందం కుమారుడు, నటుడు రాజా గౌతమ్ రెండో సారి తండ్రైనట్లు ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. ఈసారి పాప పుట్టింది.. మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది. సంతోషం రెట్టింపు అయ్యిందని పేర్కొన్నాడు. తన కుమారుడు.. బుజ్జిపాపతో ఆడుకుంటున్న ఫొటోను సైతం పోస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో సినీ సెలబ్రిటీలు, అభిమానులు బ్రహ్మానందం, ఆయన కుమారుడికి అభినందనలు తెలుపుతున్నారు. ఇక బ్రహ్మానందం కుమారుడు గౌతమ్కు 2012లో జోత్స్న రెడ్డితో వివాహంఅయ్యింది.
ఐదేళ్ల క్రితం గౌతమ్ దంపతులకు కుమారుడు పార్థ జన్మించాడు. ఇక తాజాగా జోత్స్న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్.. ఇన్స్ట్రాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. మనవరాలి రాకతో బ్రహ్మానందం ఇంట ఆనందం రెట్టింపు అయ్యింది. ఇక గౌతమ్కు అభినందనలు తెలిపిన వారిలో లక్ష్మీ మంచు, బిందు మాధవి.. వంటి వారు ఉన్నారు.