ప్రపంచ సినీ చరిత్రలోనే తొలిసారిగా మెగా ఫ్యాన్స్ చిరంజీవి కోసం అరుదైన కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ అరుదైన కార్యక్రమం ఏంటంటే?
మెగాస్టార్ చిరంజీవి..మేరు పర్వతం అనే తెలుగు సినిమా ఇండస్ట్రీ శిఖరం మీద కుర్చీ వేసుకొని మరీ కూర్చున్న నటుడు. చిరంజీవి సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఆ ముందు రోజు నుంచే తెలుగు రాష్ట్రాల్లో పండగ వాతావరణం నెలకొని ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరూ మా చిరంజీవి సినిమా చూడాలని చెప్పి తమ కుటుంబంతో సహా థియేటర్స్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఎప్పటికప్పుడు ట్రెండ్స్ ని సృష్టించే మెగాస్టార్ ఇప్పుడు తన భోళాశంకర్ మూవీకి సంబంధించి సరికొత్త ట్రెండ్ సృష్టించే పనిలో ఉన్నారు. ఆగష్టు 11న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా భోళా శంకర్ మూవీ విడుదల కాబోతుంది.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ చిరంజీవి అభిమానులని కలుపుకొని హైదరాబాద్ లో ఒక భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. బహుశా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా ఇండియన్ చిత్ర పరిశ్రమలోనే ఇంతవరకు ఏ సినిమాకి జరగని కార్యక్రమం ఇదే అనుకుంట. భోళాశంకర్ మూవీ విడుదల సందర్భంగా హైదరాబాద్ నగరంలో 600 కిలోమీటర్ల మేర భారీ ర్యాలీని నిర్వహిస్తున్నారు. పైగా ఈ ర్యాలీ ఆసాంతం జీపీఎస్ అనుసంధానంతో నడుస్తుంది. అంటే 600 కిలోమీటర్ల మేర ర్యాలీ జరుగుతున్నంత సేపు జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా చిరంజీవికి సంబంధించిన ముఖ చిత్రం కనిపిస్తూ ఉంటుంది. జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఈ ఉదయం ర్యాలీ మొదలైంది.
ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున్న చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న భోళాశంకర్ చిత్ర బృందం మెగాస్టార్ తో ఇంతవరకు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్ చిరంజీవితో తమ కున్న అనుభవాలని వీడియోల రూపంలో తమకు పంపాలని కోరింది. ఇదంతా మెగాస్టార్ లో ఉన్న గొప్పతనాన్ని ప్రేక్షకులకి తెలియజేయడానికే అని చిత్ర నిర్మాణ సంస్థ అయిన ఏకే ఎంటెర్టైన్మెంట్స్ సంస్థ తెలిపింది. అలాగే చిరంజీవి అభిమానులు విజయవాడ-సూర్యాపేట జాతీయ రహదారిపై ఉన్న రాజుగారి తోట వద్ద 126 అడుగుల చిరంజీవి కటవుట్ ని ఏర్పాటు చేశారు..ఇండియాలోనే అంత పెద్ద భారీ కటవుట్ ని ఇంతవరకు ఏ ఇతర హీరోకి కూడా ఏర్పాటు చేయలేదు. మరి ఇంతగా అభిమానులు చిరంజీవిపై అభిమానాన్ని చాటుకుంటుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.