సాధారణంగా సెలబ్రిటీల టాక్ షోలంటే ప్రేక్షకులతో పాటు అందులో హాజరయ్యే హీరోల ఫ్యాన్స్ కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. ఈ మధ్యకాలంలో ఆ స్థాయిలో జనాల అటెన్షన్ సొంతం చేసుకున్న టాక్ షో ‘అన్ స్టాపబుల్’. నటసింహం నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటిటిలో ప్రసారమవుతున్న ఈ షో.. అతి కొద్ది సమయంలోనే దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకుంది. గతేడాది మొదటి సీజన్ సక్సెస్ కాగా.. ఈ ఏడాది సెకండ్ సీజన్ మరింత గ్రాండ్ గా సక్సెస్ అందుకుంటోంది. హోస్ట్ గా బాలయ్య అదరగొడుతూ.. షోకి వచ్చే సెలబ్రిటీలతో ఎన్నో సరదా విషయాలు చర్చిస్తున్నారు.
ఇప్పటికే బాలయ్య షోలో చాలామంది టాలీవుడ్ స్టార్స్ అందరూ వచ్చి వెళ్లారు. ఇంకా వస్తూనే ఉన్నారు. కానీ.. పాన్ ఇండియా ఫ్యాన్స్ ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్న ఎపిసోడ్ కి సమయం రానే వచ్చింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన బెస్ట్ ఫ్రెండ్ గోపీచంద్ తో బాలయ్య షోలో ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ తన ఎంటైర్ కెరీర్ లో హాజరైన మొదటి తెలుగు సెలబ్రిటీ టాక్ షో ఇదే కావడం విశేషం. ఇదివరకు వేరే సినిమా ప్రమోషన్స్ లో హిందీ టాక్ షోస్ లో పాల్గొన్నాడు. కానీ.. తెలుగులో ఇదే మొదటిది. ఈ క్రమంలో బాలయ్య షోలో ప్రభాస్ ఎపిసోడ్ కి సంబంధించి తాజాగా ప్రోమో వదిలారు ఆహా వారు.
ఇదివరకు చిన్న ప్రోమో బిట్ వదిలితేనే పాన్ ఇండియా స్థాయిలో వైరల్ అయ్యింది. ఈసారి మరో ప్రోమోలో ఏకంగా చాలా సర్ప్రైజ్ లు ప్లాన్ చేశారు. అయితే.. షోలో ప్రభాస్, గోపీచంద్ లే కాకుండా లైవ్ కాల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొన్నాడు. దీంతో ఫ్యాన్స్ కి త్రిబుల్ బొనాంజా అయ్యింది. అంతేగాక లైవ్ కాల్ లో చరణ్ కి బాలయ్య సరదాగా స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. ‘సంక్రాంతికి రిలీజ్ అవుతున్న వీరసింహారెడ్డి సినిమానే ముందు చూడాలని, మీ నాన్నగారి వాల్తేరు వీరయ్య సినిమా తన సినిమా తర్వాతే చూడాలని సరదాగా చిన్న స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు బాలయ్య. ప్రస్తుతం ఈ ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి చరణ్ కి కాల్ లో బాలయ్య సరదా వార్నింగ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.