నందమూరి బాలకృష్ణ ఎంత మంచి నటుడు మాత్రమే కాక.. ఎంతో బోళా మనిషి అంటారు.. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. అయితే ఈ ముక్కుసూటితన వల్ల ఆయన కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి అదే సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాసివ్ హిట్ సాధించింది. ఈ క్రమంలో చిత్ర బృందం.. ఆదివారం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ‘అక్కినేని, తొక్కినేని’ అంటూ బాలకృష్ణ మాట్లాడిన వీడియోపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
వీర సింహారెడ్డి సక్సెస్ మీట్లో బాలయ్య మాట్లాడుతూ సినిమా షూటింగ్ సమయంలో.. నటుల మధ్య ఏ అంశాలు చర్చకు వచ్చేవో తెలుపుతూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రాజేశాయి. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాలో అందరూ అద్భుతంగా నటించారు. వీళ్లతో నాకు మంచి టైమ్ పాస్ అయ్యింది. వీళ్లతో కూర్చుని వేద శాస్త్రాలు, నాన్నగారు, డైలాగులు, ఆ రంగారావు, ఈ అక్కినేని, తొక్కినేని అన్నీ మాట్లాడుకునే వాళ్లం’’ అంటూ ఈ సందర్భంగా బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే వివాదాస్పదం అవుతున్నాయి. బాలయ్య వ్యాఖ్యలపై అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
మీ నాన్నగారి సహా నటుడు.. తెలుగు సినీ చరిత్రలో మీ నాన్న ప్రస్థానం ఎంత గొప్పదో.. నాగేశ్వరరావు గారి కెరీర్ కూడా అంతే గొప్పగా సాగింది.. వారిద్దరి మధ్య అన్నదమ్ముల అనుబంధం ఉండేది.. ఆయన వయసుకు కూడా విలువ ఇవ్వకుండా ఇలా వ్యాఖ్యానించడం ఎంత వరకు కరెక్ట్.. ఇదేనా మీ సంస్కారం అని అక్కినేని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. మరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.