చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎప్పుడూ ఊహించలేరు. ఎందుకంటే.. తొంబై తొమ్మిది పాజిటివ్స్ ఉన్నా.. జరిగిన ఒకే ఒక్క నెగటివ్ పైనే అందరి ఫోకస్ పడుతుంది. సో.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ అందాలను భూతద్దం పెట్టినట్లుగా జూమ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అంటోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్.
ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ వివాదాల ద్వారానే వార్తల్లో నిలుస్తున్నారు. ఓవైపు ఫ్యాన్స్ కొత్త సినిమాల అప్ డేట్స్ కోసం ఎదురు చూస్తుండగా.. అవకాశాలు లేని హీరోయిన్స్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ.. వివాదాలకు దారి తీస్తున్నారు. ఈ క్రమంలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ హీరోయిన్.. కొన్నాళ్లుగా వివాదాలకు దారితీసే పోస్టులు పెడుతూ షాకిస్తోంది.
రామ్ గోపాల్ వర్మ.. వివాదం ఎక్కడ ఉంటే అక్కడ ఆయన ఉంటాడు.. కాదు కాదు ఆర్జీవీ ఎక్కడ ఉంటే అక్కడ వివాదం ఉంటుంది అని కొందరు కామెంట్స్ చేస్తుంటారు. తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు ఆర్జీవీ.
ఆర్ఆర్ఆర్.. ఆస్కార్ వేడుకలో హిస్టరీ క్రియేట్ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్.. నాటు నాటు సాంగ్ తో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అందుకుంది. 95వ ఆస్కార్ వేడుకలలో సంచలనం సృష్టిస్తూ.. ఆర్ఆర్ఆర్ తెలుగు సినిమా సత్తాని, ఇండియన్ సినిమా స్థాయిని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఆస్కార్ గెలిచినందుకు ఆర్ఆర్ఆర్ సినిమాని కొనియాడుతూనే.. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్త చర్చలకు తెరలేపారు.
ప్రస్తుతం 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. కేజీఎఫ్ 2 గురించి చేసిన కామెంట్స్ భారీ చర్చలకు తెరలేపాయి. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న వెంకటేష్.. కేజీఎఫ్ పై 'నీచ్ కమిన్ కుత్తే' అంటూ ఘాటు విమర్శలు చేస్తూ.. హేళన చేశాడు. దీతో ఇప్పుడు వెంకటేష్ మాటలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీయగా.. అతనిపై ట్రోల్స్, విమర్శలతో దాడికి దిగారు నెటిజన్స్, మూవీ లవర్స్.
కేజీఎఫ్ సినిమాపై పరోక్షంగా కామెంట్స్ చేసిన వెంకటేష్ మహా.. తాను తలచుకుంటే కేజీఎఫ్ ని మించిన సినిమా తీయగలను అంటూ కామెంట్స్ చేశారు.
రోజురోజుకూ ఎన్నో కొత్త సినిమాలు వస్తూనే ఉన్నాయి. వీటిలో జనాదరణ పొందేవి రెండు రకాలు. ఒకటి కంటెంట్ మీద నడిచేవి.. రెండు హీరో - డైరెక్టర్ లేదా ఆ సినిమాకున్న క్రేజ్ పరంగా నడిచేవి. కానీ.. కంటెంట్ ఉన్న సినిమాలకు రావాల్సిన క్రేజ్ కంటే.. ఎక్కువ క్రేజ్, కలెక్షన్స్ మాస్ సినిమాలకు వస్తుంటుంది. అన్ని సినిమాలు అందరికీ నచ్చాలని లేదు. ఇలాంటి తరుణంలో.. 'కేరాఫ్ కంచరపాలెం' డైరెక్టర్ వెంకటేష్ మహా.. బాక్సాఫీస్ వద్ద రూ. 1000 కోట్లు కలెక్ట్ చేసిన KGF 2 సినిమాపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారాయి.
ఇండియన్ సినిమా అంటే ఒకప్పుడు బాలీవుడ్ పేరే చెప్పేవారు. సౌత్ సినిమాలని బాలీవుడ్ కి పరిచయం చేయాలంటే ఏ దర్శకుడు కూడా ధైర్యం చేసేవాడు కాదు. కానీ బాహుబలి తర్వాత ఒక్కసారిగా సీన్ మారిపోయింది. అయితే అనూహ్యంగా గత కొంత కాలంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ మూగబోయింది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ సీనియర్ నటుడు "నసీరుద్దీన్ షా" సౌత్ సినిమాల మీద పగ పట్టినట్లుగా సంచలన వ్యాఖ్యలు చేసాడు.
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వివాదాలలో నిలిచే నటులలో ప్రకాష్ రాజ్ ఒకరు. ఈ మధ్యకాలంలో ప్రకాష్ రాజ్ అన్ని విషయాలపై కాంట్రవర్సీ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. అయితే.. ఏ విషయాన్నైనా కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన తీరు. తాజాగా కేరళలోని తిరువనంతపురంలో జరుగుతున్న మాతృభూమి ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్(MBIFL 2023)ఈవెంట్ లో పాల్గొని మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ మూవీ సక్సెస్ […]
నందమూరి బాలకృష్ణ ఎంత మంచి నటుడు మాత్రమే కాక.. ఎంతో బోళా మనిషి అంటారు.. ఆయన గురించి పూర్తిగా తెలిసిన వాళ్లు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా మనసులో ఉన్నది మాట్లాడతారని బాలయ్యకు పేరుంది. అయితే ఈ ముక్కుసూటితన వల్ల ఆయన కొన్ని సార్లు వివాదాల్లో చిక్కుకుంటారు. తాజాగా మరోసారి అదే సంఘటన చోటు చేసుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా బాలయ్య వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మాసివ్ హిట్ సాధించింది. ఈ […]