విశ్వక్ సేన్ తో అర్జున్ సినిమా చేయాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఈ సినిమాతో అర్జున్ తన కూతురిని హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలని ఎన్నో కలలు కన్నారు. కానీ విశ్వక్ తో వివాదం వల్ల అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఎక్కడైతే అవమానం జరిగిందో మళ్ళీ అక్కడే తన కూతురికి మంచి భవిష్యత్తు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమా ప్రేక్షకులను తన యాక్టింగ్ తో ఉర్రూతలూగించిన నటుడు యాక్షన్ కింగ్ అర్జున్. కొన్ని నెలల క్రితం తన స్వీయ దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా తన కూతురు ఐశ్వర్యని హీరోయిన్ గా ఒక మూవీని ప్రారంభించిన విషయం అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఆ మూవీ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో గానీ ఆ మూవీ ఆగిపోయింది. అర్జున్ అండ్ విశ్వక్ సేన్ ల మూవీ ఆగిపోయిన విషయంలో ఒకరి మీద ఒకరు సంచలన ఆరోపణలు కూడా చేసుకున్నారు. ఇంక అసలు విషయానికి వస్తే అర్జున్ తాజాగా తన కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా ఒక సినిమాని ప్రారంభించారు.
మూవీ షూటింగ్ హైదరాబాద్ లో ప్రారంభం అయ్యింది. ఈ మూవీని అర్జున్ తన స్వీయ దర్శకత్వంలో చేస్తున్నారు. అంతే కాకుండా కథ, స్క్రీన్ ప్లే, మాటలు కూడా అర్జునే కావడం విశేషం. పాన్ ఇండియా లెవల్లో ఈ మూవీని అర్జున్ తెరకెక్కించనున్నారు. గతంలో అర్జున్ కూతురు ఐశ్వర్య తమిళంలో హీరోయిన్ గా కొన్ని సినిమాలు చేసినా ఆ సినిమాలేవి ఐశ్వర్యకి పెద్దగా గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పుడు ఈ సినిమాతో ఐశ్వర్యని పాన్ ఇండియా లెవల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా నిలబెట్టడానికి అర్జున్ ప్రయతిస్తున్నారు. కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర సోదరుని కుమారుడైన నిరంజన్ ఈ మూవీ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు.
ప్రకాష్ రాజ్, సత్యరాజ్, జయరాం లాంటి సూపర్ యాక్టర్స్ ఈ మూవీలో నటిస్తున్నారు. అర్జున్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీకి కేజీఎఫ్ ఫేమ్ హిన్ థేష్ సంగీతాన్ని అందిస్తున్నారు. సో ఎక్కడైతే తన కూతురు మూవీ ఆగిపోయిందో.. అక్కడే అర్జున్ తన కూతురితో సినిమాని ప్రారంభించారు. తెలుగు సినిమాకి తన సత్తాని చూపించడానికి అర్జున్ సిద్ధమవుతున్నారని అర్థమవుతుంది. అలాగే కూతురు సినీ భవిష్యత్తు కోసం అర్జున్ పడుతున్న ఆరాటం చూసి చాలా మంది అర్జున్ ని అభినందిస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.